ETV Bharat / city

నేటి నుంచి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.. భక్తులకు అనుమతిపై సందిగ్ధత!

author img

By

Published : Mar 24, 2021, 9:16 AM IST

tirumala
tirumala

నేటి నుంచి శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే పుష్కరిణిలోనికి భక్తులను అనుమతించే విషయంలో సందిగ్ధత నెలకొంది.

tirumala
tirumala

తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలకు భక్తుల అనుమతిపై సందిగ్ధత నెలకొంది. తెప్పోత్సవాల నిర్వహణపై జరిగిన సమావేశంలో పుష్కరిణిలోకి భక్తులను అనుమతించాలని నిర్ణయించారు అధికారులు. నేటి నుంచి తెప్పోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం పుష్కరిణి వద్ద ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తామని బోర్డులను పెట్టారు. ఈ ఉదయం ఆ బోర్డులనూ తిరిగి తొలగించారు. ఇదే విషయంపై అధికారుల వివరణ కోరగా.. సరైన సమాచారం ఇవ్వడం లేదు. ఫలితంగా భక్తుల్లో గందరగోళం నెలకొంది.

ఇదీ చదవండి

ప్రత్యేక హోదా కుదరదు..ఆ స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.