ETV Bharat / city

'దేశం దృష్టిని ఆకర్షించేలా వైకాపాను గెలిపించండి'

author img

By

Published : Mar 27, 2021, 2:18 PM IST

minister peddireddy
తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పెద్దిరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి తాజా వార్తలు

తిరుపతి ఉపఎన్నికల్లో దేశం దృష్టిని ఆకర్షించేలా వైకాపాను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి ఓటర్లను కోరారు. తిరుపతి వైకాపా అభ్యర్థి గురుమూర్తితో కలిసి పలు మండలాల్లో ప్రచారం నిర్వహించారు.

దేశం దృష్టిని ఆకర్షించేలా తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపాను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. తిరుపతి వైకాపా అభ్యర్థి గురుమూర్తితో కలిసి సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం మండలంలో మంత్రి ప్రచారం నిర్వహించారు. నవరత్నాలు, సంక్షేమ పథకాలు అమలుతో నిరుపేదల జీవితాల్లో మార్పు వచ్చిందని.. మరిన్ని పథకాల అమలుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. నారాయణవనం, కేవీబీపురం మండలాలలో ప్రచారం నిర్వహించారు.

ఇదీ చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఛత్తీస్​గఢ్ సీఎం బాఘెల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.