ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తా: చింతా మోహన్

author img

By

Published : Apr 9, 2021, 4:05 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయని తిరుపతి ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ఈ ఉపఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తా
తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తా

తిరుపతి ఉప ఎన్నికలో విజయం సాధిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ ధీమా వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఆయన ప్రచారం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పన్నుల భారం మోపుతున్నాయన్నారు. వైకాపా అరాచకపాలనకు అడ్డుకట్ట వేయాలంటే ఉప ఎన్నికలో ఆ పార్టీని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇదీచదవండి

రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు: భాజపా నేత లక్ష్మణ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.