ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 5pm

author img

By

Published : Dec 31, 2021, 5:01 PM IST

ప్రధాన వార్తలు @ 5pm
ప్రధాన వార్తలు @ 5pm

.

  • Minister Sucharitha On Jinnah Tower issue: శాంతిభద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోం - హోంమంత్రి

Minister Sucharitha On Jinnah Tower: మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం సరికాదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరులోని జిన్నా టవర్​ అంశంపై స్పందించిన ఆమె.. ఏన్నో ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన చిహ్నాలను తొలగించాలనడం మంచి పద్ధతి కాదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • GST Council Meeting: చేనేత కార్మికులకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి: మంత్రి బుగ్గన

Finance Minister Buggana: చేనేత కార్మికులకు ఇబ్బంది లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి బుగ్గన అన్నారు. సరైన అధ్యయనం చేశాకే జీఎస్టీ విధింపుపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నేటినుంచి అందుబాటులో ప్రీమియం బ్రాండ్ల మద్యం...కారణమదే..!

ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ప్రీమియం బ్లాండ్ల మద్యం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర అబ్కారీ శాఖ అనుమతి జారీ చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • BEL New Independent Director : బీఈఎల్ ఐడీగా పార్థసారథి...ఉత్తర్వులు జారీ...

BEL New Independent Director: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో ఇండిపెండెంట్ డైరెక్టర్​గా పార్థసారథిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అరుణాచల్​ ప్రాంతాలకు పేర్లు పెట్టడాన్ని సమర్థించుకున్న చైనా

China Naming Arunachal Pradesh: అరణాచల్​ప్రదేశ్​లో 15 ప్రాంతాలకు చైనీస్​ పేర్లు పెట్టడాన్ని చైనా సమర్థించుకుంది. ఈ విషయంపై భారత్​ గురువారం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో శుక్రవారం వివరణ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్.. దక్షిణ టిబెట్​లో భాగమని, తాము పేర్లు పెట్టడం తప్పేంకాదని అదే వితండవాదం చేసింది.​ పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సాయంత్రం 5 గంటల నుంచి బీచ్​లు, పార్కుల్లోకి నో ఎంట్రీ!

Night Curfew in Mumbai: కరోనా కేసుల పెరుగుదలతో ముంబయిలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బీచ్​లు, పార్కులు, ఇతర బహిరంగ స్థలాలకు ప్రజలు రాకుండా నిషేధించారు. జనవరి 15 వరకు ఈ నిబంధనలు అమలులో ఉండనున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్రతి 10 సెకన్లకు 43 మంది జననం.. 2021లో జనాభా పెరుగుదల ఇలా...

World population: 2022 జనవరి 1నాటికి ప్రపంచవ్యాప్తంగా జనాభా 780కోట్లుగా ఉంటుందని అమెరికా సెన్సస్ బ్యూరో తెలిపింది. 2021 నుంచి 2022 మధ్య ప్రతి సెకనుకు 4.3 మంది పుడితే.. ఇద్దరు మరణించారని చెప్పింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ షురూ! త్వరలోనే రెండో విడత బుకింగ్​!!

Ola Electric scooters: బుక్​ చేసుకున్న వారందరికీ ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్లను డెలివరీ చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే వాటిని డిస్పాచ్ చేసినట్లు వెల్లడించింది. త్వరలోనే రెండో విడత బుకింగ్ ఓపెన్ చేస్తామని చెప్పింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ద్రవిడ్​లా కనిపిస్తున్నాడు.. టీమ్​ఇండియా తర్వాతి కెప్టెన్ అతడే​'

Rahul Dravid: క్రికెట్​లో రాహుల్​ ద్రవిడ్ ఒక లెజెండ్​. 'ది వాల్'​గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పుజారా నయావాల్​గా అవతరించినా ప్రస్తుతం ఫామ్​లేమితో తీవ్రంగా సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్​. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • Arjuna phalguna review: 'అర్జున ఫల్గుణ' ఎలా ఉందంటే?

Arjuna phalguna movie: విభిన్న కథలతో ప్రేక్షకుల్ని మెప్పించే శ్రీవిష్ణు.. 'అర్జున ఫల్గుణ' అంటూ థియేటర్లలోకి వచ్చేశారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.