Nellore floods : వరద కట్టిన కన్నీరు.. మంత్రి కాళ్ల మీద పడ్డ మహిళలు..!

author img

By

Published : Nov 25, 2021, 3:56 PM IST

minister Gowtham reddy

వరద తగ్గినా బాధితుల బాధలు తీరలేదు. ఎవరిని పలకరించినా గుండె లోతుల్లో దాగి ఉన్న ఆవేదన ఒక్కసారిగా పెల్లుబికుతోంది. కన్నీరు కట్టలు తెంచుకుంటోంది. మంత్రుల పర్యటనలో.. తమకు సాయం చేయాలంటూ కాళ్లమీద పడి వేడుకుంటున్నారు.

నెల్లూరు జిల్లాలో వరద ముంపును ఎదుర్కొన్న ప్రతి గ్రామంలోనూ.. బాధితుల కన్నీరు వరద కడుతోంది. ఈ పరిస్థితుల్లో.. ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాలకు వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు. పరామర్శకు వెళ్లిన వారిని వరద బాధితులు అడ్డుకుని ప్రశ్నిస్తున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆత్మకూరు నియోజకవర్గంలో వరద బాధితులను మంత్రి గౌతమ్​రెడ్డి పరామర్శించారు. పెన్నా పరివాహక ప్రాంతంలోని అప్పారావుపాలెం గిరిజనులు.. తమను ఆదుకోవాలంటూ మంత్రి కాళ్ల మీద పడ్డారు.

ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రుల బృందం పర్యటన

వరదల ధాటికి సర్వం కోల్పోయామని కన్నీళ్లపర్యంతమయ్యారు. వారి కష్టాలు విని చలించిన మంత్రి గౌతంరెడ్డి.. సుమారు కిలోమీటరు దూరం నడిచి వెళ్లి వారి స్థితిగతులు తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని హమీ ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు కొత్త కాలనీలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

మొన్న కోవూరులో ఇంఛార్జి మంత్రి బాలినేని, ఎమెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి.. నిన్న ఆత్మకూరులో మంత్రులు బాలినేని, మేకపాటి గౌతమ్ రెడ్డి.. నేడు ఆత్మకూరులో మహిళలు మంత్రుల కాళ్లు పట్టుకుని కన్నీరు పెట్టారు. సర్వం కోల్పోయామని.. కట్టు బట్టలతో మిగిలామని బోరున విలపించారు.

అనంతసాగరం మండలంలోని సోమశిల ప్రాజెక్టు, ప్రాచీన సోమేశ్వర ఆలయం ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. మంత్రులు కనపడగానే తమను ఆదుకోవాలని రేవూరు మహిళలు బోరున విలపించారు. అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రులు బాధితులకు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

Chandra babu Naidu visit Nellore: నెల్లూరు జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.