NELLORE RAINS: ఉద్ధృతంగా పెన్నా నది.. రాకపోకలు నిలిపివేత

author img

By

Published : Nov 20, 2021, 10:12 AM IST

Updated : Nov 21, 2021, 4:09 AM IST

NELLORE RAINS

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల వల్ల వాగులు పొంగుతున్నాయి. జిల్లాలోని అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు మునిగిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు.

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల వల్ల వాగులు పొంగుతున్నాయి. జిల్లాలోని పలు గ్రామాలు, కాలనీలు(heavy rains in nellore district lead to flood water in villages) నీటమునిగాయి. నెల్లూరు భగత్‌సింగ్‌కాలనీ, నవాబ్​పేటలు నీటమునిగాయి. ముంపు ప్రాంత ప్రజలను పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వెంకటేశ్వరపురంలోని టిడ్కో ఇళ్లు నీటమునిగాయి. నెల్లూరు జిల్లాలో పెన్నా నది ఉగ్రరూపం దాల్చడంతో.. పొర్లుకట్టలు కోతకు గురయ్యాయి. జిల్లాలోని ఇందుకూరుపేట పేట మండలం ముదివర్తి పాలెం వద్ద ఉన్న పెన్నా పొర్లు కట్ట తెగిపోవడంతో 5 గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. ముదివర్తి పాలెం, నిడు ముసలి, కె ఆర్ పాలెం, రాముడు పాలెం గ్రామాలు జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. కృష్ణపట్నం చిన్న తూముల వద్ద విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.

గ్రామాలను చుట్టుముట్టిన వరద.. నీట మునిగిన రహదారులు

వరద ముంపులో గ్రామాలు.. రైతు మృతి

గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద పోటెత్తడంతో పెన్నా నది తీరంలోని గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వరద తీవ్రతకు బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట మండలాల్లో పోర్లుకట్టలు కోతకు గురయ్యాయి. ఫలితంగా వరద ప్రవాహం గ్రామాలపై పడి, నివాసాలను ముంచెత్తింది. బుచ్చి మండలంలోని పెనుబల్లి, మినగల్లు, కాకులపాడు, దామరమడుగు, పల్లిపాలెం గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెం, ముదివర్తిపాళెం, రాముడుపాళెం, విడవలూరు మండలంలోని ముదివర్తి, పొన్నపుడి, ఊటుకూరు, కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెం గ్రామాలు జలదిగ్భంధమయ్యాయి. అర్ధరాత్రి వరద తీవ్రత అధికమై నివాసాల్లోకి నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. బుచ్చి మండలం శ్రీరంగరాజపురం గ్రామానికి చెందిన బుజ్జయ్య అనే రైతు పొలం వద్ద ఉండగా, ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు. మరోపక్క ముంబయి జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ స్తంభించింది. ఆత్మకూరు వద్ద జాతీయ రహదారిపై వరద నీరు చేరుకోవడంతో.. పలుగ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సంగం మండలం కోలగట్ల, బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద రహదారులపై వరద ప్రవహిస్తోంది.

సోమశిలకు పోటెత్తిన వరద..

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. జలాశయానికి ఇన్‌ఫ్లో 4,02,100 క్యూసెక్కులు ఉండటంతో.. అధికారులు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఔట్‌ఫ్లో 3,82,016 క్యూసెక్కులుగా ఉంది. సోమశిల గరిష్ఠ నీటిమట్టం 77.988 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 70,075 టీఎంసీలుకు చేరుకుంది. వరద నీటిని కిందకు వదలడంతో.. అధికారులు పెన్నా పరివాహక ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. భారీవర్షాలకు సోమశిలలో సోమేశ్వరస్వామి ఆలయం కుప్పకూలింది.

రాత్రి నుంచి వరదలో చిక్కుకున్న వ్యక్తి..

బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు వద్ద వరదలో పవన్ అనే వ్యక్తి చిక్కుకున్నాడు. శ్మశానవాటిక వద్ద పెన్నానది ఉద్ధృతికి వరదలో చిక్కుకుపోయాడు. బైక్‌పై వెళ్తున్న పవన్.. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్తంభం ఎక్కాడు. రాత్రి నుంచి పవన్‌ను కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చదవండి:

RAINS: నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. గ్రామాలు జలదిగ్బంధం

Last Updated :Nov 21, 2021, 4:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.