బిట్రగుంట రైల్వేస్టేషన్​లో వ్యక్తి హల్​చల్​.. భార్య విడిచి వెళ్లిందని..

author img

By

Published : Sep 14, 2022, 5:33 PM IST

railway accident

Suicide Attempt : కేరళ నుంచి ఝార్ఖండ్ వెళ్లాల్సిన వ్యక్తి బిట్రగుంట రైల్వే స్టేషన్​లో దిగాడు. తన భార్య తనను వదిలి వెళ్లిపోయిందంటూ కొద్దిసేపు హంగామా చేశాడు. భార్య ఇక రాదేమోనని మనస్థాపానికి గురైన అతను.. రైల్వే కరెంట్​ స్తంభం ఎక్కి విద్యుత్​ తీగలను పట్టుకొని అత్మహత్యాయత్నం చేశాడు.

Suicide Attempt: నెల్లూరు జిల్లా బిట్రగుంట రైల్వేస్టేషన్​లో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. విద్యుత్​ తీగలను పట్టుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు. కండీర్ (34) కేరళ నుంచి ఝార్ఖండ్​కు వెళ్తున్నాడు. కానీ తను వెళ్లాల్సిన గమ్యం రాకముందే.. బిట్రగుంట రైల్వే స్టేషన్​లో దిగాడు. ఆత్మహత్య చేసుకుంటానని కొద్దిసేపు హంగామా చేశాడు. ఎంతమంది ఆపినా వినకుండా... విద్యుత్​ స్తంభం ఎక్కి కరెంట్​ తీగలను పట్టుకున్నాడు. అంతే షాక్​ తగిలి కిందపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, ఘటనాస్థలానికి చేరుకుని 108 వాహనంలో కావలి వైద్యశాలకు తరలించారు.

కండీర్​ది ఝార్ఖండ్ రాష్ట్రంగా రైల్వే పోలీసులు పేర్కొన్నారు. భార్యతో గొడవపడటంతో.. ఆమె అతడిని విడిచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మనస్థాపంతో కండీర్​ ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.