ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 5pm

author img

By

Published : Jan 2, 2022, 4:57 PM IST

ప్రధాన వార్తలు @ 5pm
ప్రధాన వార్తలు @ 5pm

.

  • Vaikunta Dwara Darshanam: తిరుమల దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోం: తితిదే ఛైర్మన్
    Vaikunta Dwara Darshanam at tirumala: ఈ నెల 13 నుంచి 22 వరకు వైకుంఠద్వార దర్శనం ఉంటుందని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ పది రోజుల్లో ఎటువంటి సిఫార్సు లేఖలనూ తీసుకోబోమని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • Minister Buggana: 'రెండంకెల దిశగా రాష్ట్ర వృద్ధి రేటు.. ఓర్వలేకే తెదేపా అబద్ధాల ప్రచారం'
    Minister Buggana: రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకున్న ప్రతి రూపాయికీ లెక్కలు చూపిస్తామని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. కొవిడ్ సంక్షోభాన్ని అధిగమించేందుకు కేంద్రం అనుమతించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తోందని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • NIGHT CURFEW IN YANAM : యానాంలో రాత్రి కర్ఫ్యూ.. ఎప్పటివరకంటే..?
    కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా.. యానాంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తూ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రివాల్వర్‌తో కాల్చుకుని.. హోమ్ గార్డ్స్ విభాగం అధికారి ఆత్మహత్య
    రివాల్వర్‌తో కాల్చుకుని హోమ్ గార్డ్స్ విభాగం ఏఆర్ అధికారి ఈశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన విజయనగరంలోని పోలీస్ క్వార్టర్స్‌ నివాసంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సోమవారం నుంచి పిల్లలకు టీకా- స్పెషల్​ గిఫ్టులు కూడా!
    దేశవ్యాప్తంగా సోమవారం నుంచి 15-18ఏళ్ల వయస్సు వారికి టీకాలు అందించనున్నారు. ఇందుకోసం దిల్లీ, ముంబయితో పాటు ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. పిల్లలకు టీకాలు అందించేందుకు దిల్లీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తిలక్​ నగర్​లోని ఓ వ్యాక్సినేషన్​ కేంద్రాన్ని పిల్లల ఇష్టాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • బంగాల్​లో విద్యాసంస్థలు బంద్​.. 50% స్టాఫ్​​తోనే ఆఫీసులు!
    West Bengal Restrictions: మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బంగాల్​లో ఆంక్షలను విధించింది అక్కడి ప్రభుత్వం. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం సహా 50 శాతం సిబ్బందితోనే కార్యాలయాలు పనిచేయాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆ ఫైనాన్షియర్ 'వలపు వల'లో ఇద్దరు మాజీ అధ్యక్షులు!
    Jeffrey Epstein Trafficking: అమెరికాలో అతిపెద్ద సెక్స్​ కుంభకోణానికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి. అగ్రరాజ్యంలో అతిపెద్ద ఫైనాన్షియర్‌ అయిన ఆ వ్యక్తి తన పరపతి పెంచుకోవడం కోసం ఏళ్ల తరబడి పెద్ద తలలకు టీనేజ్‌ అమ్మాయిలను ఎరగా వేశాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వృద్ధికి కరోనా, ద్రవ్యోల్బణాలే సవాళ్లు.. ఆ​ ప్రకటనలే దిశానిర్దేశాలు
    economic challenges in india: కరోనా వచ్చిన నాటి నుంచి ఇబ్బందులు పడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ.. ఈ ఏడాదిలో కూడా అదే బాటలో నడవబోతుందని నిపుణులు చెప్తున్నారు. దేశీయంగా పెరుగుతున్న కరోనా కేసులు, ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు తప్పవని అంటున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. ప్లాన్ సిద్ధం చేశా'
    Venkatesh Iyer All-Rounder: దక్షిణాఫ్రికా పర్యటన కోసం సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు యువ ఆటగాడు వెంకటేశ్​ అయ్యర్​. అక్కడి పిచ్​లపై రాణించేందుకు తన వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నట్లు చెప్పాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఇది లవ్​లెటర్స్​ టైమ్.. 'రాధేశ్యామ్​' రిలీజ్​పై డైరెక్టర్​ క్లారిటీ
    Radhe Shyam: రెబల్​స్టార్​ ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్' సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 'ఆర్​ఆర్​ఆర్'​ వాయిదా పడిన నేపథ్యంలో 'రాధేశ్యామ్​' విడుదల తేదీపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదలపై స్పష్టతనిచ్చారు దర్శకుడు రాధాకృష్ణ కుమార్. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.