తెలుగుదేశం నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కాకినాడ గ్రామీణ నియోజకవర్గ ఇంఛార్జ్గా కొనసాగనున్నట్లు ప్రకటించారు. ఆమె భర్త పిల్లి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా తెదేపా కార్యదర్శి పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. మాజీ హోంమంత్రి చినరాజప్పతో విభేధాల కారణంగా పార్టీ పదవుల్ని వదిలేస్తున్నట్లు శుక్రవాం దంపతులిద్దరూ వెల్లడించారు. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్టుడుతో పిల్లి అనంతలక్ష్మి దంపతులు సమావేశమయ్యారు. పదవుల్లో కొనసాగాలని ఆయన చెప్పడంతో.. ఇద్దరూ అంగీకరించారు.
ఇదీ చదవండి: తెదేపా పదవులకు మాజీ ఎమ్మెల్యే దంపతుల రాజీనామా