ETV Bharat / city

TIGER IN KAKINADA: బోనులో చిక్కకుండా తప్పించుకున్న పులి.. ట్రాపింగ్​ కెమెరాలో దృశ్యాలు

author img

By

Published : Jun 5, 2022, 11:15 AM IST

Updated : Jun 6, 2022, 6:29 PM IST

TIGER IN KAKINADA
ఇంకా చిక్కని పులి జాడ

TIGER IN KAKINADA: కాకినాడ జిల్లాలో పెద్దపులి అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది.పెద్దపులిని బోనులో బంధించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఆహారం, వసతి సౌకర్యంగా ఉండటంతో పులి ఇక్కడే వేటాడుతున్నట్లు సమాచారం. నాలుగైదేళ్ల వయసు నుంచే పులి దూకుడుగా వేటాడుతోంది.

ఇంకా చిక్కని పులి

TIGER IN KAKINADA: కాకినాడ జిల్లాలో పెద్దపులి అలజడి ఇంకా కొనసాగుతూనే ఉంది. పెద్దపులిని బోనులో బంధించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. పులిని బంధించాలని అటవీ సిబ్బంది పొదురుపాక, శరభవరంలో బోన్లు ఏర్పాటు చేశారు. తాజాగా శరభవరంలో ఏర్పాటు చేసిన బోన్‌ వద్దకు పులి వచ్చినట్లు గుర్తించారు. ఇప్పటికే పులి కోసం 3 బోన్లు ఏర్పాటు చేసిన అటవీ సిబ్బంది.. కొత్తగా మరో 2 బోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆహారం, వసతి సౌకర్యంగా ఉండటంతో పులి ఇక్కడే వేటాడుతున్నట్లు సమాచారం. నాలుగైదేళ్ల వయసునుంచే పులి దూకుడుగా వేటాడుతోంది. పెద్దపులిని తొందరగా బంధించాలని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వేడుకుంటున్నారు.

Tiger in kakinada: కాకినాడ జిల్లాలో 14 రోజులుగా పెద్ద పులి సంచారంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. శుక్రవారం పొదురుపాక వద్ద ఆవుని చంపిన పులి.. గురువారం రాత్రి శరభవరం వద్ద రెండు గేదెలపై దాడి చేసింది. పులి దాడి నుంచి గేదెలు గాయాలతో తప్పించుకున్నాయి. పులి దాడులతో ఒమ్మంగి, పోతులూరు, పొదురుపాక, పాండవులపాలెం, శరభవరంలో.. తీవ్ర అలజడి నెలకొంది. పులిని అడవికి పంపేందుకు.. అటవీ, వణ్యప్రాణి సంరక్షణ అధికారులు చర్యలు ప్రాంభించారు. ఇప్పటివరకు పులి కదలికలపై నిఘా పెట్టడం, పాదముద్రలు సేకరించడం, సీసీ కెమెరాలు అమర్చడం వంటివి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.

ప్రత్తిపాడు మండలంలో ఒమ్మంగి గ్రామ సమీపంలోని సరుగుడు తోటల్లో రెండు గేదెలు అడవి జంతువు వేటాడిందని భయం పట్టుకున్న అయిదు రోజుల తర్వాత పులి కళ్ల ముందుకు వచ్చేసింది. అప్పటి నుంచి యథేచ్ఛగా సంచరిస్తూ ఎక్కడి పనులు అక్కడ ఆపేసింది. దానంతట అది అడవికి వెళ్లేలా చేయడం సాధ్యపడలేదు. బోనుల్లో బంధించాలని చూసినా తప్పించుకుంటోంది.. రెండోసారి వరుసగా శనివారం తెల్లవారుజామున బోను చూసి పక్కనుంచి వెళ్లిపోయిన దాని తెలివిని ట్రాపింగ్‌ కెమెరాలు వరుసగా బంధించాయి. మండలంలోని పోతులూరు, ఒమ్మంగి, పొదురుపాక పాండవులపాలెం, శరభవరం గ్రామాల మధ్య సరుగుడు తోటలు దట్టమైన చెట్లతో ఉండే మెట్టల్లో సంచరిస్తోంది. రోజూ 15 కి.మీ మేరే దాని ప్రయాణం ఉంటోంది.

యంత్రాంగం ఉరుకులు: జూన్​ 2న పొదురుపాక సమీపంలోని పశువుల పాకపై పంజా విసిరింది. ఒక ఆవును వేటాడి సమీప తోటల్లోకి ఈడ్చుకెళ్లి, ఆవు మెడ భాగం కొంత తినేసి వెళ్లింది. రంగంలోకి దిగిన అధికారులు.. రిజర్వు ఫారెస్టు వైపు మళ్లిందనే అంచనాకు వచ్చేలోపే వెనుదిరిగి పంజా విసరడంతో గురువారం ఉదయం అటవీయంత్రాంగమంతా పొదురుపాక వైపు ఉరుకులు పెట్టింది. వైల్డ్‌లైఫ్‌ డీఎఫ్‌వో సెల్వం, జిల్లా అటవీఅధికారి ఐకేవీ రాజు, స్క్వాడ్‌ డీఎఫ్‌వో ఎన్వీ ప్రసాదరావు, ఏసీఎఫ్‌ సౌజన్య, రేంజరు వరప్రసాదరావు సిబ్బంది ఆవును వేటాడిన ప్రదేశం, పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. పోతులూరు నుంచి పొదురుపాకకు బేస్‌ క్యాంపు మార్చారు. పులిని పట్టి తరలించే వాహనాన్ని అక్కడే ఉంచారు. బోనులను పోతులూరు వద్ద సిద్ధంగా ఉంచారు.

ఎస్‌టీసీఏ బృందం రాక: పులి జాడ తెలిసినప్పటి నుంచి నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) ఇక్కడి యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తోంది. ఆవును వేటాడిన నేపథ్యంలో ఎన్‌టీసీఏ ముగ్గురు సభ్యులతో కూడిన బృందం మండలానికి వచ్చింది. పులి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది. పులిని బంధించే విషయమై డీఎఎఫ్‌వో ఛైర్మన్‌గా వైల్డ్‌లైఫ్‌ డీఎఫ్‌వో, ఎన్టీసీఏ ప్రతినిధి, పశుసంవర్ధక ఏడీ, సర్పంచితో కూడిన బృందం రోజువారీ పరిణామాలను ఇక్కడి పరిస్థితులను ఉన్నత వర్గాలకు నివేదించి నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.

నిశితనిఘా..: పులి సంచరించే వీలున్న మార్గాల్లో 40 కెమెరా ట్రాప్‌లు ఏర్పాటుచేసి నిఘా వేశారు. ఒమ్మంగి, పోతులూరు, కొడవలి మధ్య సంచరించి ఊదరేవడి మెట్టపై బస చేసిన పెద్దపులికి నాలుగైదేళ్లు వయసు ఉండొచ్చని అంచనా. 180 కేజీలకు పైనే బరువు.. ఆరున్నర అడుగుల పొడవు ఉంటుందని చెబుతున్నారు. వేటాడే క్రమంలో దారి తప్ఫి. విజయనగరం జిల్లా ఎస్‌.కోట - అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మీదుగా వందల కిమీ ప్రయాణించి ఇటు వచ్చినట్లు గుర్తించారు. ఒమ్మంగి సమీపంలో రెండు గేదెలను వేటాడిన పులి.. ఆహార అన్వేషణకు అనుకూలతతో ఊదరేవడి మెట్టపైనే మకాం పెట్టినట్లు భావిస్తున్నారు. మెట్టకు 6 కి.మీ. దూరంలో పాండవులపాలెం వైపు వెళ్లిందని బుధవారం కన్పించిన పాదముద్రల ఆధారంగా తెలుస్తోంది. అక్కడికి సమీపంలో అభయారణ్యం ఉండడంతో బెబ్బులి గమనం అటువైపు ఉంటుందా.. ఆహారం రుచి మరిగిన పులి వెనక్కి వస్తుందా అనే భయాందోళన నెలకొంది.

క్షణక్షణం..: పులి సంచారంతో సమీప ఆరు గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. జాతీయ జంతువు కావడంతో నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) మార్గదర్శకాల ప్రకారం కమిటీ ఏర్పాటుచేసి.. రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించాలి. కమిటీ ఏర్పాటు చేసినా.. పరిస్థితి చేయిదాటితేనే రెస్క్యూ ఆపరేషన్‌ వరకు వెళ్లే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. కెమెరా ట్రాప్‌ల ద్వారా కదలికలపై నిశిత నిఘా వేశారు. పులికి ఎలాంటి హాని కలగకుండా అడవి వైపు గమనం సాగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాండవులపాలెం సమీపంలో చెరువు వద్ద పులి పాదముద్రలు గుర్తించిన అధికారులు దాదాపు అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లేనని భావిస్తున్నామని వన్యప్రాణుల సంరక్షణ విభాగం డివిజనల్‌ అధికారి సెల్వం చెప్పారు. మరికొద్దిరోజులు నిశిత పరిశీలన తర్వాత స్పష్టతకు వస్తామన్నారు.

మే 23: ఒమ్మంగి సమీపంలోని సరుగుడు తోటల్లో రెండు గేదెలు వేర్వేరు రోజుల్లో చనిపోయినట్లు గుర్తింపు. అడవి జంతువులు చంపేసినట్లు అనుమానంతో అటవీ అధికారులకు రైతుల ఫిర్యాదు.

మే 24: గేదెను వేటాడిన తీరు, పాదముద్రల ఆధారంగా క్రూర మృగమని అంచనా. నిఘా కెమెరాల ఏర్పాటు.

మే 25: పులి సంచారంపై చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం.

మే 26: పులి సంచరించే వీలున్న మార్గాల్లో కెమెరా ట్రాప్‌ల అమరిక.

మే 27: పోతులూరు ఊదరేవడి మెట్ట వద్ద గేదెను చంపిన పులి. పర్యవేక్షణకు అటవీశాఖ ప్రత్యేక బృందాల నియామకం.

మే 28: పోతులూరు పరిసరాల్లో పెద్ద పులి సంచరిస్తున్న దృశ్యాలు నిఘా కెమెరాల్లో నిక్షిప్తం.

మే 29: డీఎఫ్‌వో రాజు, వన్యప్రాణి సంరక్షణ విభాగం డీఎఫ్‌వో సెల్వం, శిక్షణ ఐఎఫ్‌ఎస్‌ భరణి ఆధ్వర్యంలో 150 మంది సిబ్బందితో కొడవలి పంపు హౌస్‌ వద్ద బేస్‌ క్యాంపు ప్రారంభం.

మే 30: పెద్దపులి కదలికలు సీసీ కెమెరాల్లో మళ్లీ నిక్షిప్తం. ధర్మవరం సమీప పోలవరం కాలువ వరకు వెళ్లి, వెనక్కి మెట్ట దగ్గరకు వచ్చినట్లు గుర్తింపు.

మే 31: పోతులూరు ఊదరేవడిమెట్టపై మకాం వేసిన పెద్దపులి జాడ ట్రాకింగ్‌ కెమెరాల్లో కనిపించలేదు.

జూన్‌ 1: బెంగాల్‌ రాయల్‌ టైగర్‌గా గుర్తింపు. పాండవులపాలెం సమీప చెరువు వద్ద పులి పాదముద్రల గుర్తింపు. తోటపల్లి, బవురువాక రిజర్వ్‌ అటవీ ప్రాంతాలు ఉండటంతో అటు వెళ్లినట్లు అంచనా.

జూన్​ 2: పాండవులపాలెం-పొదురుపాక సమీపంలో మళ్లీ పశువులపై పులి దాడి చేసి... ఆవును చంపింది.

జూన్​ 3: పొదురుపాకలో వేటాడిన ఆవు కళేబరం వద్దకు మళ్లీ వచ్చిన పెద్దపులి... ఆవు కళేబరాన్ని కొంతమేర తినేసి వెళ్లింది.

జూన్​ 4: మరో దూడను చంపింది. బోన్ల వద్దకు పులి వచ్చి వెళ్లినట్లు గుర్తించారు.

జూన్ 5: శరభవరంలో బోన్‌ వద్దకు పులి వచ్చినట్లు గుర్తింపు

ఇవీ చదవండి:

Last Updated :Jun 6, 2022, 6:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.