ETV Bharat / city

కడప పెద్ద దర్గాను సందర్శించిన హోంమంత్రి

author img

By

Published : Feb 28, 2020, 12:56 PM IST

కడప పెద్ద దర్గాను హోంమంత్రి సుచరిత సందర్శించారు. సంప్రదాయ పద్ధతిలో దర్గా నిర్వాహకులు హోంమంత్రికి స్వాగతం పలికారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దర్గాలో ప్రార్థించినట్లు సుచరిత తెలిపారు. ఎంతో ప్రసిద్ధి గాంచిన కడప పెద్ద దర్గాను దర్శించడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. కడప పర్యటనలో భాగంగా ఆమె ఇవాళ దర్గాను సందర్శించారు. ఆమె వెంట ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు.

home-minister-visit-kadapa-darga
home-minister-visit-kadapa-darga

కడప పెద్ద దర్గాను సందర్శించిన హోంమంత్రి

ఇవీ చదవండి: విశాఖ వచ్చి తీరుతా.. ఎన్నిసార్లు ఆపుతారో చూస్తా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.