జనసేన పార్టీ కోసం తాను కష్టపడితే తనను ఆదుకుంటామని చెప్పి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ... జూనియర్ ఆర్టిస్ట్ సునీత ధర్నాకు దిగింది. ఫిలిం ఛాంబర్ వద్ద తనను తాను గొలుసులతో బంధించుకుంది. రాత్రంతా అలాగే ఉండి నిరసన వ్యక్తం చేసింది.
గీతా ఆర్ట్స్ లో సినిమా ఛాన్సులు ఇప్పిస్తామని నిర్మాత బన్నీ వాస్ తనను మోసం చేశారని ఆరోపించింది. దీనిపై అల్లు అరవింద్ స్పందించాలని డిమాండ్ చేసింది. విషయం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు... సునీతను స్టేషన్కు తీసుకెళ్లి.. కౌన్సిలింగ్ చేసి ఇంటికి పంపించారు.