ETV Bharat / city

'ఆరు మాసాల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు'

author img

By

Published : Jan 3, 2020, 1:24 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇబ్బందులే తప్ప... రాష్ట్రాభివృద్ధి శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

amaravathi-capital-and-cm-jagan
'ఆరు మాసాల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు'

'ఆరు మాసాల్లో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు'

సీఎం జగన్మోహన్ రెడ్డి... తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని... రాజకీయ దురుద్దేశంతోనే మూడు రాజధానులంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నా... పరిపాలన సజావుగా చేయలేకపోతున్నారని... అధికారం చేతికొచ్చిన ఆరు మాసాల్లో రాష్టాన్ని అతలాకుతలం చేశారని ధ్వజమెత్తారు. రాజధానిపై సరైన నిర్ణయం ప్రకటించకుండా చెవిలో పువ్వులు పెడుతున్నారన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా గుంటూరులో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి... సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.

ఇవీ చూడండి-రహదారిపై బైఠాయించి రైతుల ఆందోళన

Intro:నోట్‌...విజువల్స్‌, బైట్స్‌ మోజో 765 ద్వారా పంపాను. పరిశీలించగలరు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన గోయ్యిని తానే తవ్వుకుంటున్నారని...దురుద్దేశంతోనే మూడు రాజధానులంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. జగన్‌ సీఎం అయితే ధర్నాలు చేసే అవకాశం ఉండదని అనుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 150 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా పరిపాలనా చేయలేకపోతున్నారని అధికారం చేతికొచ్చిన ఆరు మాసాల్లో రాష్టాన్ని అతలాకుతలం చేశారని ధ్వజమెత్తారు. ఇప్పడు రాజధాని పై సరియైన నిర్ణయం ప్రకటించాకుండా మాకు చెవిలో పూలు పెడుతున్నారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి ఒక పిట్టకథ లా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారని కమిటీల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం దీక్షలో పాల్గొన్న వారికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు నిమ్మరసం అందించి దీక్షను విరమింపచేశారు.

బైట్‌: కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి సీపీఐ
: ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి Body:గుంటూరు పశ్చిమConclusion:కిట్‌ నెంబర్‌: 765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.