ETV Bharat / city

'సుప్రీం తీర్పు వచ్చే వరకు ఎస్​ఈసీ రమేశ్ కుమారే'

author img

By

Published : Jun 12, 2020, 1:51 AM IST

ఎస్​ఈసీ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే వరకు రమేశ్ కుమారే రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా కొనసాగుతారని వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు అన్నారు. రమేశ్ కుమార్​ను పునర్నియమించే బాధ్యత గవర్నర్​పైనే ఉంటుందన్నారు.

mp raghu rama krishnam raju
mp raghu rama krishnam raju

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునర్నియామక అంశంపై దాఖలైన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు ఎస్​ఈసీగా రమేశ్ కుమారే కొనసాగుతారని వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. రమేశ్ కుమార్​ను పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ప్రస్తుతానికి హైకోర్టు తీర్పే చెల్లుబాటువుతుందన్నారు. రమేశ్ కుమార్​ను పునర్నియమించే బాధ్యత గవర్నర్ పైనే ఉంటుందని చెప్పారు.

సారాంశాన్ని అన్వయించుకోవాలి..

'రమేశ్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమగ్రంగా పరిశీలించి.. మొత్తం సారాంశాన్ని అన్వయించుకోవాలే తప్ప...ప్రతి వాక్యానికి విడిగా భాష్యం చెప్పడం కుదరదు. రమేశ్ కుమార్​ను తిరిగి ఎస్​ఈసీగా నియమించకపోతే కోర్టు ధిక్కరణ నేరం కింద ప్రభుత్వంపై కోర్టులో పిటిషన్ వేసేందుకూ ఆయనకు అవకాశముంది. రమేశ్ కుమార్​ను రాజ్యాంగంలోని 243 కె అధికారం ప్రకారం గవర్నర్ నియమించారు. జస్టిస్ కనగరాజ్​ను ఏపీ పంచాయతీరాజ్ చట్టం కింద నియమించారు. జస్టిస్ కనగరాజ్ నియామకం చెల్లకపోతే... రమేశ్ కుమార్ నియామకం కూడా చెల్లదన్న వాదన సరికాదు' - రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ

ఇదీ చదవండి:

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారినెలా తొలగిస్తారు?: సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.