ETV Bharat / city

తెదేపా హయాంలోనే వివేకా హత్య.. ఇప్పుడెందుకు ధర్నాలు?: నాగార్జున

author img

By

Published : Apr 14, 2021, 3:27 PM IST

చంద్రబాబు నుంచి లోకేశ్.. నడ్డా నుంచి దియోధర్ వరకూ రాజ్యాంగంపై ఎవరికీ నమ్మకం లేదని వైకాపా ఎమ్మెల్యే మేరుగు నాగార్జున దుయ్యబట్టారు. వివేకా హత్య చంద్రబాబు హయాంలోనే జరిగిందని.. ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడెందుకు ధర్నాలు చేస్తున్నాయని ప్రశ్నించారు.

tdp protest at tirupati
ycp mla merugu nagarjuna

అలిపిరిలో తెదేపా నేతల ధర్నాపై వైకాపా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు హయాంలో జరిగిన ఈ హత్యపై దర్యాప్తు జరుగుతోందని.. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీ ఇప్పుడెందుకు ధర్నాలు చేస్తున్నాయని ప్రశ్నించారు. దళితులపై దాడులు చేయించిన తెదేపా..అంబేడ్కర్​కు నివాళులు అర్పించే అర్హత లేదన్నారు.

తిరుపతి ఉప ఎన్నికలో అత్యంత హీనమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నుంచి లోకేశ్.. నడ్డా నుంచి దియోధర్ వరకూ రాజ్యాంగంపై ఎవరికీ నమ్మకం లేదని దుయ్యబట్టారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో ఉన్న వైకాపా అభ్యర్థి మతం ఏమిటని భాజపా నేతలు ప్రశ్నించటం దారుణమని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

బాబాయ్​ని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్​కు లేదా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.