ETV Bharat / city

నిండుకుండలా తుంగభద్ర... పది గేట్ల ద్వారా నీటి విడుదల

author img

By

Published : Aug 17, 2020, 2:16 PM IST

Updated : Aug 17, 2020, 2:26 PM IST

ఎగువన కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. ఇప్పటికే ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తిన అధికారులు... భారీగా వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని మరో ఏడు గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

water release with ten gates of thungabhadra project
నిండుకుండలా తుంగభద్ర జలాశయం

తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. కర్ణాటక రాష్ట్రంలో శిమెగ్గ జిల్లాలో భారీ వర్షాల ధాటికి 40 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి చేరుతోంది. సోమవారం మధ్యాహ్నానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తుందని జలాశయం అధికారులను కేంద్ర జల సంఘం హెచ్చరించింది.

నిండుకుండలా తుంగభద్ర జలాశయం

ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ వంద టీఎంసీలు కాగా.. ఇప్పటికే 99 టీఎంసీల నీటిని నిలువచేశారు. ఆదివారం రాత్రి మూడు గేట్లను తెరిచిన అధికారులు... భారీగా వస్తోన్న వరదలకు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు పదిగేట్లు ఎత్తి, 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. హెచ్​ఎల్​సీ, ఎల్​ఎల్​సీ కాలువలకు నీటి ప్రవాహం కొనసాగుతోంది.

ఇదీచదవండి.

నిండుకుండలా ప్రకాశం బ్యారేజీ

Last Updated :Aug 17, 2020, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.