ETV Bharat / city

'చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి మంత్రుల్ని బయటకు పంపాలి'

author img

By

Published : Apr 16, 2021, 7:34 PM IST

వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంటే రాష్ట్ర మంత్రివర్గమంతా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనే ఉన్నారని అన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వారిని ఆయా జిల్లాల నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు

tdp leader varala ramaiyya
tdp leader varala ramaiyya

తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంటే రాష్ట్ర మంత్రివర్గమంతా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనే మకాం వేసిందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వారిని ఆయా జిల్లాల నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

ఇతర పార్టీల నేతలను తిరుపతి పార్లమెంట్ పరిధి నుంచి పంపించిన పోలీసులు.. అధికార పార్టీ నేతల్ని ఎందుకు ఉంచారని వర్ల రామయ్య విమర్శించారు. మంత్రులంతా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనే ఉన్నారనే సమాచారం డీజీపీకి ఉందా ? లేదా? అని వర్ల ప్రశ్నించారు. చంద్రగిరి, పుంగనూరు, పీలేరు, పలమనేరు నియోజకవర్గాల నుంచి స్థానికేతరులను తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి తరలించారని వర్ల ఆరోపించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కరోనా కల్లోలం- కొత్తగా 6,096 కేసులు, 20 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.