ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

author img

By

Published : Feb 24, 2022, 8:58 PM IST

ప్రధాన వార్తలు @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM

.

  • ఉక్రెయిన్​లో 70 సైనిక స్థావరాలు ధ్వంసం: రష్యా

ఉక్రెయిన్​పై భీకర దాడులు చేపడుతోంది రష్యా సైన్యం. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేస్తున్నట్లు చెబుతున్న రష్యా.. తాజాగా ఉక్రెయిన్​లోని 70 సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది రష్యా. ధ్వంసం చేసిన వాటిలో 11 ఎయిర్​ ఫీల్డ్స్​ కూడా ఉన్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఉక్రెయిన్​లో భారత పౌరుల పడిగాపులు- 20 వేలమందికిపైగా..!

ఉక్రెయిన్​పై రష్యా యుద్ధానికి దిగిన క్రమంలో ఆ దేశంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆ దేశ గగనతలాన్ని మూసివేసిన క్రమంలో వేలాది మంది భారత పౌరులు, విద్యార్థులు చిక్కుకున్నారు. దీంతో వారిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై అన్వేషిస్తోంది. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని, మూడో అడ్వైజరీని జారీ చేసింది అక్కడి భారత రాయబార కార్యాలయం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఇండియన్ ఎంబసీ నుంచి స్పందన లేదు: ఉక్రెయిన్​లోని తెలుగు విద్యార్థులు

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధ భయాలతో అక్కడి తెలుగువారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. క్షణక్షణం తాము ప్రాణభయంతో బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి, తాగడానికి కూడా తమకు ఇబ్బందిగా ఉందని చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పోటీని ఎదుర్కొంటూ.. వీలైనంత తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: సీఎం జగన్

సహకార బ్యాంకుల ద్వారా వీలైనంత తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రైతుల ఆదరణ పొందడం ద్వారా డీసీసీబీలు లాభాల బాటలో నడిచేలా చూడాలన్నారు. రుణాల మంజూరులో ఎక్కడా రాజీ పడొద్దని.., రాజకీయాలకు చోటు ఉండకూడదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వివేకా హత్య రక్తపు మరకలు తెదేపాకు అంటించాలని చూశారు: చంద్రబాబు

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన జగన్​రెడ్డి ప్రతి ఒక్కరినీ బెదిరిస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విచారణ సంస్థల్ని సైతం బెదిరించే స్థాయిలో వివేకా హత్య కేసు ముద్దాయిలు ఉన్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సినీ పరిశ్రమపై కక్ష సాధించి ఏం చేస్తారు?: జేసీ ప్రభాకర్‌రెడ్డి

ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కక్షసాధింపు చర్య వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడే పరిస్థితి వచ్చిందని తెదేపా నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ పై కక్ష కట్టారని ఆరోపించారు. సినీ పరిశ్రమ కోసం చిరంజీవి సైతం మాట్లాడినా స్పందించకపోవడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్​ని ఏమి చేయలేక సినిమా వాళ్ళపై ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'విపక్షాలకు ఆ ధైర్యం లేదు- ఓటు బ్యాంకు పోతుందనే భయం'

UP Election 2022: యూపీలో జరిగిన తొలి నాలుగు దశ ఎన్నికల్లో ఓటర్లు భాజపా వైపే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఓట్ల విభజనలో విపక్షాల లెక్క తప్పిందన్నారు. ఈ క్రమంలోనే కుటుంబ పార్టీలపై విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కూతురికి మూడు పెళ్లిళ్లు.. రూ.200 కోసం తల్లి నిర్వాకం!

ఉత్తరాఖండ్​ ఉదంసింగ్‌ నగర్‌ జిల్లాలో అమ్మతనానికే మచ్చ తెచ్చే ఘటన వెలుగుచూసింది. కుమార్తె బతుకును చక్కదిద్దాల్సిన తల్లే డబ్బు కోసం మూడుసార్లు అమ్మేసింది, మూడు పెళ్లిళ్లు చేసింది. అభంశుభం తెలియని చిన్నారితో వ్యభిచారం చేయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • IND VS SL: కోహ్లీ, షోయబ్ రికార్డుకు చేరువలో రోహిత్​

భారత కెప్టెన్​ రోహిత్​ శర్మ తన ఖాతాలో మరో రెండు రికార్డులు వేసుకునేందుకు సిద్ధమయ్యాడు. గురువారం నుంచి శ్రీలంకతో మెుదలయ్యే టీ20 సిరీస్​లో 37 పరుగులు చేస్తే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కునున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఉక్రెయిన్​లో షూటింగ్​ చేసిన భారతీయ సినిమాలు ఇవే!

ప్రస్తుతం ఉక్రెయిన్​లో బాంబులతో మోత మోగిపోతుంది. అయితే ఈ దేశంలో దక్షిణాది సినిమాలు గతంలో షూటింగ్ చేశాయి. వీటిలో 'ఆర్ఆర్ఆర్', '2.ఓ' చిత్రాలు ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.