ETV Bharat / city

నేడు దిల్లీలో కీలక సమావేశం, ఏపీ విభజన అంశాలపై చర్చ

author img

By

Published : Aug 24, 2022, 8:11 PM IST

Updated : Aug 25, 2022, 6:27 AM IST

ap map
ap map

KEY MEETING ABOUT AP BIFURCATION ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలు, ఏపీకి పెండింగులో ఉన్న అంశాలపై ఈరోజు మధ్యాహ్నం దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ప్రధాని ఆదేశం మేరకు రాష్ట్ర అధికారులతో కేంద్ర అధికారుల బృందం భేటీ కానుంది.

KEY MEETING ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశాలు, ఆర్థిక సంబంధిత విషయాలు, ఏపీకి పెండింగులో ఉన్న అంశాలపై ఈరోజు మధ్యాహ్నం దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టివి సోమనాథన్ నేతృత్వంలో జరగనున్న సమావేశంలో ప్రధానికి సీఎం ఇచ్చిన వినతులు, పెండింగు అంశాల పరిష్కార మార్గాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ఆదేశం మేరకు రాష్ట్ర అధికారులతో కేంద్ర అధికారుల బృందం భేటీ కానుంది. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు నార్త్ బ్లాక్ లోని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి విజయసాయిరెడ్డి, పలు శాఖల అధికారులు హాజరుకానున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Aug 25, 2022, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.