ETV Bharat / city

AP CORONA: రాష్ట్రంలో కొత్తగా 865 కరోనా కేసులు.. 9 మరణాలు

author img

By

Published : Oct 2, 2021, 5:07 PM IST

Updated : Oct 2, 2021, 7:07 PM IST

today ap corona cases
ఏపీలో కొత్తగా 865 కరోనా కేసులు

17:00 October 02

రాష్ట్రంలో కొత్తగా 865 కరోనా కేసులు

today ap corona cases
రాష్ట్రంలో కొత్తగా 865 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 50,304 పరీక్షలు నిర్వహించగా.. 865 కేసులు నిర్ధారణ(latest corona cases of ap) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,51,998 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 9 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 14195 కి చేరింది. తాజాగా 1,424 మంది బాధితులు కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 20,27,229 కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,574 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,84,00,471 నమూనాలను ఆరోగ్య శాఖ(covid cases in ap) పరీక్షించింది. 

  కరోనాతో చిత్తూరు జిల్లాలో మరో ముగ్గురు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందినట్లు(covid deaths in ap) వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 172, చిత్తూరులో 168 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఇదీ చదవండి.. 

Coronavirus update: దేశంలో మరో 24,354 మందికి కరోనా

Last Updated : Oct 2, 2021, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.