ETV Bharat / city

నేడు 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' నిధుల విడుదల

author img

By

Published : May 18, 2021, 4:15 AM IST

YSR matsyakara bharosa scheme
వైఎస్ఆర్ మత్స్యకారుల భరోసా

నేడు 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. అర్హుల ఖాతాల్లోకి పదివేల నగదు జమ చేయనున్నారు.

'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' పథకం ద్వారా నేడు మత్స్యకారులకు ప్రభుత్వం 10వేల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. ముఖ్యమంత్రి జగన్ క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్ ద్వారా అర్హుల ఖాతాలోకి నగదు జమ చేయనున్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్‌ 14 వరకు మత్స్యకారుల వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో వారి కుటుంబ పోషణ నిమిత్తం ప్రభుత్వం ఏటా 10వేల రూపాయల సాయం అందిస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది దాదాపు లక్షా 20వేల మంది ఖాతాల్లో 119.88 కోట్ల రూపాల ఆర్థిక సాయం జమ చేయనుంది.

ఇదీ చదవండి

మిలిటరీ ఆస్పత్రికి ఎంపీ రఘురామ.. నేడు పూర్తిస్థాయి వైద్యపరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.