ETV Bharat / city

INCOME TO TS GOVT: ఆ రాష్ట్ర రాబడి ఎంతో తెలుసా?

author img

By

Published : Sep 9, 2021, 3:35 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(current financial year) ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా 43 వేల కోట్ల రూపాయల పైబడి ఆదాయం(INCOME TO TELANGANA) సమకూరింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.35 వేల కోట్లు కాగా... కేంద్రం నుంచి రూ.8,600 కోట్లు వచ్చాయి. మే నెలలో కనిష్ఠంగా రూ.6,500 కోట్లు రాగా... జూన్​లో గరిష్ఠంగా రూ.పదివేల కోట్ల మార్కు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.24 వేల కోట్ల రుణం తీసుకొంది.

Telangana  Income
తెలంగాణ ఆదాయం

కరోనా(COVID), లాక్​డౌన్(LOCKDOWN) ప్రభావం కారణంగా రాష్ట్ర ఖజానా కోల్పోయిన ఆదాయం క్రమంగా పెరుగుతోంది. లాక్​డౌన్ అమలుతో మే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం(INCOME TO TELANGANA) బాగా పడిపోయింది. మే నెలలో సర్కారు ఖజానాకు రూ.5,169 కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్టు గణాంకాల వరకు పరిశీలిస్తే అత్యధికంగా జూలైలో రూ.8,357 కోట్ల ఆదాయంగా సమకూరింది. ఏప్రిల్​లో రూ.6,840 కోట్లు, జూన్​లో రూ.6,871 కోట్లు.. ఆగస్టులో 7831 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చాయి.

రాబడి వచ్చిందిలా..

కేంద్రం నుంచి జూన్ నెలలో అత్యధికంగా 3,559 కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా జూన్ నెలలో ఎక్కువగా రూ.10,429 కోట్లు సమకూరాయి. 2021-22 ఆర్థికసంవత్సరంలో రాష్ట్ర సొంత పన్నుల ద్వారా ఆగస్టు నెలాఖరు వరకు రూ.33,061 కోట్లు వచ్చాయి. అమ్మకం పన్ను ద్వారా రూ.10,617 కోట్లు, జీఎస్టీ ద్వారా రూ.10,921 కోట్లు వచ్చాయి. ఎక్సైజ్ ద్వారా రూ.6,046 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.3,701 కోట్లు, రవాణా పన్ను ద్వారా రూ.1,573 కోట్లు ఖజానాకు చేరాయి. పన్నేతర ఆదాయం రూ.2,006 కోట్ల రూపాయలు చేకూరింది.

ఆదాయం రూ.43,764 కోట్లు

కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు రూ.8,698 కోట్లు రాష్ట్రానికి వచ్చాయి. అందులో కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.4,469 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా 2,632 కోట్ల రూపాయలు సమకూరాయి. రూ.913 కోట్లు ఆర్థికసంఘం నిధులు, రూ.683 కోట్లు జీఎస్టీ(GST) పరిహారంగా అందాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు నెల వరకు రాష్ట్రానికి అన్ని రకాలుగా సమకూరిన ఆదాయం రూ.43,764 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.24 వేల కోట్లు రుణంగా తీసుకొంది. రైతుబంధు, రుణమాఫీ చెల్లింపులు, దళితబంధుకు నిధుల కోసం ప్రభుత్వం రుణాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది.

సంబంధిత కథనాలు:BANK ROBBERY: బ్యాంకులో దోపిడీకి యత్నం.. కంప్యూటర్లు, హార్డ్​డిస్కులతో పరార్..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.