ETV Bharat / city

రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు: ఐఎండీ

author img

By

Published : Sep 26, 2020, 8:29 AM IST

Updated : Sep 26, 2020, 2:06 PM IST

రాగల నాలుగు, ఐదు గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ సూచించారు.

rains
rains


రాష్ట్రంలోని పలు జిల్లాలో రాగల నాలుగు, ఐదు గంటల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతోపాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాల కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు తూర్పుగోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని....అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ సూచించారు.

ఇదీ చదవండి: ఉరుములు, మెరుపులతో వర్షాలు... రైతుల ఆందోళన

Last Updated : Sep 26, 2020, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.