ETV Bharat / city

తెలంగాణ: నీటిసంపులో పడేసి పసికందును చంపిన తండ్రి

author img

By

Published : Apr 7, 2021, 10:59 AM IST

ఎనిమిది నెలల పసికందు... అభం శుభం తెలియని చిన్నారి. తండ్రి గుండెలపై ఆడుకోవాల్సిన ఆ పసికందును... కన్నతండ్రి చిదిమేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన నాన్నే... కడతేర్చాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

father killed his son
కుమారుడిని కడతేర్చిన తండ్రి

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండలం తొండుపల్లిలో భార్యాభర్తలు విక్రమ్​, స్పందన నివసిస్తున్నారు. పెళ్లైన ఆరు సంవత్సరాలకు ఓ బాబు పుట్టాడు. విక్రమ్ హెయిర్​ కటింగ్ షాప్​లో పనిచేసేవాడు. మద్యానికి బానిసైన విక్రమ్​.. రోజు ఇంటికి వచ్చి గొడవపడేవాడు. మంగళవారం కూడా ఇంట్లో గొడవపడి కోపంతో ఆరునెలల పసికందును నీటిసంపులో పడేశాడు. ఆ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పసికందు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండీ.. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. ఆ జిల్లాల్లోనే అత్యధిక కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.