ETV Bharat / city

TS DH on Omicron: 'మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా'

author img

By

Published : Dec 2, 2021, 2:10 PM IST

TS DH on Omicron: కరోనా పూర్తిగా నిర్మూలన కాలేదని.. ఎప్పుడైనా మూడో ముప్పు వచ్చే ప్రమాదముందని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా లేకపోతే కొత్త వేరియంట్ ఒమిక్రాన్, మూడో ముప్పుపై వస్తున్న అసత్య ప్రచారాలే నిజమవుతాయని హెచ్చరించారు. ఇవాళ్టి నుంచి మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తామని చెప్పారు.

DH on Omicron
'మాస్కు ధరించకపోతే రూ.1000 జరిమానా'

మాస్కు ధరించకపోతే వెయ్యి రూపాయల ఫైన్

TS DH on Omicron Variant : కరోనా మూడో ముప్పు ఎప్పుడైనా వచ్చే అవకాశముందని.. తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) శ్రీనివాస్ తెలిపారు. ఒమిక్రాన్ నివారణకు ప్రతిఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేయాలని కోరారు. కొత్త వేరియంట్​ కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ఒమిక్రాన్ వేరియంట్​ బారిన పడకుండా ఉండాలంటే.. జాగ్రత్తగా ఉండటమొక్కటే మార్గమని అన్నారు. మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. ఇవాళ్టి నుంచి మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

Omicron cases : ప్రజలు కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, అందరు కరోనా టీకా రెండు డోసులు వేసుకోవాలని డీహెచ్ సూచించారు. రాష్ట్రంలో 25 లక్షల టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇక నుంచి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేసే ప్రతిపాదనలు చేస్తున్నట్లు వెల్లడించారు. జాగ్రత్తలు పాటించకపోతే ఒమిక్రాన్​పై, కరోనా మూడో ముప్పుపై ఇప్పుడు జరుగుతున్న అసత్య ప్రచారాలే నిజమవుతాయని అన్నారు. విద్యాసంస్థల్లో పలువురి విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తోందని.. వైరస్ ఇంకా పూర్తిగా నిర్మూలన కాలేదని స్పష్టం చేశారు.

Omicron Variant : ఒమిక్రాన్ ఏ క్షణంలోనైనా భారత్​లోకి రావొచ్చని డీహెచ్ అన్నారు. బుధవారం రోజున యూకే, సింగపూర్ నుంచి వచ్చిన 325 ప్రయాణికులకు టెస్ట్ చేశామని అందులో ఒకరికి పాజిటివ్ వచ్చిందని ఆ వ్యక్తిని టిమ్స్​లో చేర్పించామని తెలిపారు. ఆ వ్యక్తి టెస్ట్ రిపోర్టును జీనోమ్​కు పంపామని.. అది ఒమిక్రాన్​ వేరియంటా కాదా అనేది రెండ్రోజుల్లో తేలుతుందని చెప్పారు.

"ఒమిక్రాన్ ముప్పు త్వరలో తెలంగాణకూ వ్యాపిస్తుంది. కానీ మనం చాలా అప్రమత్తంగా ఉండి దాన్ని కట్టడి చేద్దాం. కొత్త వేరియంట్ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపించే ప్రమాదముంది. అందుకే టీకా రెండు డోసులు తీసుకోని వాళ్లంతా వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి. మూడు రోజుల్లో 3 దేశాల నుంచి 26 దేశాలకు విస్తరించింది. కొత్త వేరియంట్ డెల్టా కంటే ప్రమాదకరమని, దానికంటే 6 రెట్లు వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వ్యాక్సిన్ తీసుకోండి.. ప్రాణాలు కాపాడుకోండి. ప్రభుత్వానికి, ఆరోగ్య అధికారులకు సహకరించండి. అందరం కలిసి పని చేస్తేనే కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ వేరియంట్ పని పట్టగలం. మన రాష్ట్రం నుంచి ఆ మహమ్మారి పారద్రోలగలం."

- శ్రీనివాస్, ప్రజారోగ్య సంచాలకులు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.