జగన్ అక్రమాస్తుల కేసులో కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ
By
Published : Feb 6, 2020, 4:09 PM IST
|
Updated : Feb 6, 2020, 4:17 PM IST
telangana high court on jagan illegal assets
అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. పదకొండు అభియోగ పత్రాలపై సీబీఐ కోర్టులో విచారణకు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరటంతో.. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.
అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. పదకొండు అభియోగ పత్రాలపై సీబీఐ కోర్టులో విచారణకు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్లు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరటంతో.. అంగీకరించిన ఉన్నత న్యాయస్థానం విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.