మూడు రాజధానులతో రాష్ట్రానికి నష్టమే తప్ప... ఏ మాత్రం లాభం ఉండదని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను ఎవరూ వ్యతిరేకించరన్న ఆయన... ఏపీలో ప్రగతి జరగకుండా విచ్ఛిన్నం చేయాలనేది జగన్ కుట్రగా ఆయన అభివర్ణించారు. ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి అతికష్టం మీద వచ్చారన్న యనమల....ఇప్పుడు మళ్లీ విశాఖ వెళ్లాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వనరులు ఇందుకు సహకరించవని తెలిపారు. ఇది ఖచ్చితంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే చర్యేనన్నారు.
మూడు రాజధానులతో ఏపీకి నష్టం: యనమల
మూడు రాజధానులతో రాష్ట్రానికి నష్టమే తప్ప... ఏ మాత్రం లాభం ఉండదని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను ఎవరూ వ్యతిరేకించరన్న ఆయన... ఏపీలో ప్రగతి జరగకుండా విచ్ఛిన్నం చేయాలనేది జగన్ కుట్రగా ఆయన అభివర్ణించారు. ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతికి అతికష్టం మీద వచ్చారన్న యనమల....ఇప్పుడు మళ్లీ విశాఖ వెళ్లాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక వనరులు ఇందుకు సహకరించవని తెలిపారు. ఇది ఖచ్చితంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే చర్యేనన్నారు.