ETV Bharat / city

TDP RALLIES : అమరావతి రైతులకు సంఘీభావంగా కదం తొక్కారు..

author img

By

Published : Dec 16, 2021, 5:24 PM IST

TDP RALLIES SUPPORTING AMARAVATHI FARMERS
TDP RALLIES SUPPORTING AMARAVATHI FARMERS

TDP RALLIES : అమరావతి రైతులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో తెదేపా శ్రేణులు ర్యాలీలు నిర్వహించాయి. అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని నినాదాలు చేశారు.

అమరావతి రైతులకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు

TDP RALLIES SUPPORTING AMARAVATHI FARMERS: అమరావతి రైతులకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా.. తెదేపా శ్రేణులు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. గుంటూరు జిల్లా వేమూరులో ఎన్టీఆర్ పురవేదిక నుంచి రైల్వే స్టేషన్ ప్రధాన కూడలి వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని నినదించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో తెదేపా శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. టెక్కలిలో పార్టీ జెండాలతో తెదేపా నేతలు పట్టణ వీధుల్లో ర్యాలీ తీశారు.

విజయనగరం జిల్లాలో అమరావతి రైతులకు.. పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు సంఘీభావం తెలిపారు. విజయనగరంలో కోట కూడలి నుంచి గంట స్తంభం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. "3 రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు" అంటూ విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రదర్శన చేపట్టారు. 3 రాజధానుల నిర్ణయాన్ని సర్కారు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో తెదేపా నాయకులు పాదయాత్ర చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలోనూ తెదేపా నేతలు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చదవండి:

Amaravati Farmers Meeting: అమరావతి రైతు సభకు రాజకీయ నేతలు.. హాజరయ్యేది వీరే..!

Amravati Sabha at Tirupati: రేపు 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'..చురుగ్గా ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.