ETV Bharat / city

'ఉమ్మడి రాష్ట్రంలో ఓ భాగం అన్యాయంగా పక్కకు పోయింది'

author img

By

Published : Nov 1, 2020, 3:30 PM IST

ఉమ్మడి రాష్ట్రంలో ఓ భాగం అన్యాయంగా పక్కకు పోయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల జాతీయ జెండాను ఆవిష్కరించారు.

State Formation Day celebrations in YCP Central Office
సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు సహా మహనీయులకు నివాళులు అర్పించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఓ భాగం అన్యాయంగా పక్కకు పోయిందని.. మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకే ఉత్సవాలు జరపుతున్నట్లు తెలిపారు. దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీని తీర్చి దిద్దుకునేందుకు అందరూ పనిచేయాలని కోరారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వ ఉదాసీనతే పోలవరానికి శాపం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.