ETV Bharat / city

దిగ్విజయ్​సింగ్​పై నాన్ ​బెయిల్​బుల్​ వారెంట్​

author img

By

Published : Feb 22, 2021, 7:46 PM IST

diggi
దిగ్విజయ్​సింగ్​పై నాన్ ​బెయిల్​బుల్​ వారెంట్​

కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్​సింగ్​పై నాన్​బెయిల​బుల్​ వారెంట్​ జారీ అయింది. తెలంగాణలో ఎంఐఎం దాఖలు చేసిన పరువునష్టం దావాపై విచారణకు హాజరుకాకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధుల కోర్టు.. ఎన్​బీడబ్ల్యూ జారీచేసింది.

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్​సింగ్​పై హైదరాబాద్​లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాన్​బెయిలబుల్ వారెంట్​ జారీచేసింది. ఎంఐఎం దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణకు హాజరుకానందున.. ఎన్​బీడబ్ల్యూ జారీ చేసింది.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డబ్బుల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తారని దిగ్విజయ్ సింగ్ అన్నారని.. ఆ వ్యాఖ్యలు తమకు పరువునష్టం కలిగించేలా ఉన్నాయని ఎంఐఎం సంయుక్త కార్యదర్శి హుస్సేన్ అన్వర్.. దిగ్విజయ్ సింగ్​ సహా ఓ దినపత్రికపై వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్​పై ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది.

అనారోగ్యంగా కారణంగా.. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దిగ్విజయ్​సింగ్​ పిటిషన్ దాఖలు చేశారు. దిగ్విజయ్​సింగ్ ఇప్పటి వరకూ విచారణకు హాజరుకాలేదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీచేస్తూ విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.