ETV Bharat / city

రామోజీ ఫిల్మ్‌ సిటీని సందర్శించిన పీవీ సింధు

author img

By

Published : Feb 4, 2020, 7:12 AM IST

2011లో బ్యాడ్మింటన్‌లో ప్రవేశం.. 2013లో అర్జున అవార్డుతో సంచలనం. 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు.. రియో ఒలింపిక్స్‌లో రజతం... 2019లో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌తో... బ్యాడ్మింటన్‌ శిఖరంపై కూర్చుందా అమ్మాయి. తాజాగా పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికై... తన గుర్తింపును మరోస్థాయికి తీసుకెళ్లింది. 24 ఏళ్లు వచ్చేసరికి... అసాధ్యమైన విజయాలను ఖాతాలో వేసుకున్న తెలుగుతేజం పీవీ సింధు గురించే ఈ ఉపోద్ఘాతమంతా. కోర్టులో రాకెట్ స్పీడ్‌తో మైమరిపించే ఈ బ్యాడ్మింటన్ తార... రామోజీ ఫిల్మ్ సిటీలో సందడి చేసింది.

pv sindhu, etv bharat
రామోజీ ఫిల్మ్‌ సిటీని సందర్శించిన పీవీ సింధు

రామోజీ ఫిల్మ్‌ సిటీని సందర్శించిన పీవీ సింధు

బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు రామోజీ ఫిల్మ్‌సిటీలో సందడి చేసింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్‌ హంటర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సింధు... తన జట్టు సభ్యులతో కలిసి వచ్చింది. ఫిల్మ్‌సిటీ పర్యటనలో... సింధు మొదట ఈటీవీ భారత్‌ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. 13 భాషల్లో వార్తలు అందిస్తున్న తీరును ఈటీవీ భారత్‌ డైరెక్టర్ బృహతి ఆమెకు వివరించారు. అనంతరం సింధు ఈనాడు డెస్కుకు వెళ్లి వసుంధర విభాగంలో పనితీరు గమనించింది. సిబ్బందితో ముచ్చటించింది. వసుంధర పేజీని నిత్యం చదువుతానని సింధు వెల్లడించింది. రామోజీ గ్రూపు సంస్థల కార్పొరేట్ భవనంలో అధినేత రామోజీరావును సింధు కలిసింది. పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికైన ఆమెను... రామోజీరావు, ఈనాడు ఎండీ కిరణ్ అభినందించారు.

ఇవీ చూడండి-ఐక్యూతో చంద్రబాబును ఆశ్చర్యపరిచిన బుడతడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.