YS SHARMILA ARREST: వైఎస్​ షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

author img

By

Published : Sep 21, 2021, 2:57 PM IST

Updated : Sep 21, 2021, 3:43 PM IST

YS SHARMILA ARREST

వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిలను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ జిల్లాలో ఆమె చేపట్టిన దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.

వైఎస్​ షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మేడ్చల్ జిల్లాలోని పీర్జాదిగూడలో వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల (YSRTP President YS Sharmila)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిల నిరుద్యోగ దీక్ష( YS Sharmila Hunger Strike On Unemployment)కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అయినా సరే షర్మిల దీక్షకు దిగేందుకు యత్నించగా అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల తీరును నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు వరంగల్-హైదరాబాద్ రహదారిపై ఆందోళనకు దిగాయి. నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారిపై వాహనాలు ఆగడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

ఇదీ చదవండి:

YS Sharmila Hunger Strike : 'ఇదేందక్కా ఇది.. దీక్షకు తీసుకొచ్చి పైసలు లేవంటారా?'

Last Updated :Sep 21, 2021, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.