ETV Bharat / city

పవన్ కల్యాణ్​తో పర్లాఖెముండి ఎమ్మెల్యే భేటీ

author img

By

Published : Nov 9, 2020, 5:05 PM IST

ఒడిశాలోని పర్లాఖెముండి ఎమ్మెల్యే, గజపతి జిల్లా భాజపా అధ్యక్షుడు కోడూరు నారాయణరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను కలిశారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య పాలనాపరమైన నిబంధనలతో కొన్ని సమస్యలు వస్తున్నాయన్న ఎమ్మెల్యే... వీటి పరిష్కారానికి సహకరించాలని జనసేనానిని కోరారు.

Pawan kalyan
Pawan kalyan

ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో రెండు రాష్ట్రాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి జనసేన పక్షాన సహకరించాలని ఆ పార్టీ అధినేత పవన్ ‌కల్యాణ్​ను ఒడిశాలోని పర్లాఖెముండి ఎమ్మెల్యే, గజపతి జిల్లా భాజపా అధ్యక్షుడు కోడూరు నారాయణరావు కోరారు. సోమవారం హైదరాబాద్‌లో పవన్​ను​ ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.

ఒడిశాలోని తెలుగు ప్రజల స్థితిగతులు, సరిహద్దు ప్రాంత సమస్యలపై చర్చించారు. గజపతి జిల్లా పరిధిలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువమంది ఉన్నారని నారాయణరావు పవన్ కల్యాణ్​కు వివరించారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య పాలనాపరమైన నిబంధనలతో కొన్ని సమస్యలు వస్తున్నాయన్నారు. ఆయన విజ్ఞప్తికి పవన్ సానుకూలంగా స్పందించారు.

ఇదీ చదవండి

మెగాస్టార్​ చిరంజీవికి కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.