ETV Bharat / city

మహాపాదయాత్రకు కేంద్ర సంస్థతో భద్రత కల్పించాలి.. అమిత్ షాకు ఎంపీ రఘురామ లేఖ

author img

By

Published : Sep 13, 2022, 3:20 PM IST

Amit Shah
Amit Shah

Amaravati Farmers Maha Padayatra: అమరావతి రైతుల మహాపాదయాత్రకు, కేంద్ర సంస్థలతో ముందస్తు భద్రత కల్పించాలని.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పునకు విరుద్దంగా వ్యవహరిస్తుందని ఆయన లేఖలో ఆరోపించారు.

MP Raghu Rama Letter to Amit Shah: అమరావతి రైతుల మహాపాదయాత్రకు.. కేంద్ర సంస్థలతో భద్రత కల్పించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. పాదయాత్రలో అలజడి సృష్టించడమే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోందన్న రఘురామ.. రాజధానిపై హైకోర్టు ఆదేశాలను వైకాపా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘిస్తోందన్నారు. న్యాయస్థానం తీర్పునకు విరుద్ధంగా మంత్రులు 3 రాజధానులపై మాట్లాడుతున్నారని, రెచ్చగొట్టే ప్రకటనలు అవాంఛనీయ ఘటనలకు దారి తీస్తాయని ఎంపీ రఘురామ పేర్కొన్నారు. కేంద్ర ఏజెన్సీల ద్వారా ముందస్తు పర్యవేక్షణ, భద్రతా చర్యలు చేపట్టాలని.. రఘురామ తన లేఖలో కోరారు.

ఇవి చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.