rowdy sheets can be opened: తాజా ఆధారాలుంటే రౌడీషీట్లు తెరవొచ్చు

author img

By

Published : Sep 13, 2022, 2:12 PM IST

rowdy sheets can be opened
రౌడీషీట్లపై హైకోర్టు ()

rowdy sheets : ఏపీ పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ (పీఎస్‌వో) ఆధారంగా రౌడీషీట్‌ తెరవడం, వాటిని కొనసాగించడం, వ్యక్తులపై నిఘా ఉంచడం చెల్లదంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు ధర్మాసనం నిలిపేసింది. ఆ తీర్పు ఆధారంగా ఇప్పటికే సంబంధిత వ్యక్తులపై మూసివేసిన రౌడీషీట్‌/హిస్టరీషీట్‌/సస్పెక్ట్‌ షీట్‌లను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తెరవడానికి వీల్లేదని స్పష్టంచేసింది. తాజాగా తగిన ఆధారాలుంటే మాత్రం వారిపై ఆయా షీట్లు తెరిచే స్వేచ్ఛను పోలీసులకు ఇచ్చింది. పీఎస్‌వో నిబంధనల మేరకు అనుమానితులు, నిందితులపై పోలీసులు నిఘా పెట్టొచ్చని తెలిపింది.

rowdy sheets: ఏపీ పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌ (పీఎస్‌వో) ఆధారంగా రౌడీషీట్‌ తెరవడం, వాటిని కొనసాగించడం, వ్యక్తులపై నిఘా ఉంచడం చెల్లదంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు ధర్మాసనం నిలిపేసింది. ఆ తీర్పు ఆధారంగా ఇప్పటికే సంబంధిత వ్యక్తులపై మూసివేసిన రౌడీషీట్‌/హిస్టరీషీట్‌/సస్పెక్ట్‌ షీట్‌లను తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు తెరవడానికి వీల్లేదని స్పష్టంచేసింది. తాజాగా తగిన ఆధారాలుంటే మాత్రం వారిపై ఆయా షీట్లు తెరిచే స్వేచ్ఛను పోలీసులకు ఇచ్చింది. పీఎస్‌వో నిబంధనల మేరకు అనుమానితులు, నిందితులపై పోలీసులు నిఘా పెట్టొచ్చని తెలిపింది. అయితే ముందుగా నోటీసు ఇచ్చాకే ఏ వ్యక్తినైనా, నిందితుడినైనా ఠాణాకు పిలవాలని తేల్చిచెప్పింది.

అరెస్ట్‌ విషయంలో కోర్టు ఉత్తర్వులు అమలు చేసేందుకు, ఏదైనా కేసులో నిందితుడు/అనుమానితుడు తప్పించుకుపోతాడనే ఆందోళన ఉన్న సందర్భంలో తప్ప... రాత్రి వేళల్లో పోలీసులు నిందితుల ఇళ్లకు వెళ్లడానికి వీల్లేదంది. వేలిముద్రల సేకరణ విషయంలో చట్ట నిబంధనలు, సింగిల్‌ జడ్జి పేర్కొన్న విధంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ బి.శ్యాంసుందర్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

57 వ్యాజ్యాలపై విచారణ

రౌడీషీట్లు నమోదు చేయడం, వాటిని కొనసాగించడాన్ని సవాలు చేస్తూ సుమారు 57 వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిపై లోతైన విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. పోలీసు స్టాండింగ్‌ ఆర్డర్స్‌కు చట్టబద్ధతే లేదని, వాటి ఆధారంగా రౌడీషీటు తెరవడం, నిఘా పెట్టడం, ఠాణాల్లో ఫోటోల ప్రదర్శన సరికాదని తేల్చారు. ఆ చర్యలు గోప్యత హక్కును హరించడమేనని పేర్కొన్నారు. నిఘా, రౌడీషీటు తెరిచేందుకు వీలు కల్పిస్తున్న స్టాండింగ్‌ ఆర్డర్స్‌ చెల్లుబాటుకావని తేల్చిచెప్పారు. వ్యక్తుల సమాచారం సేకరించొద్దని ఆదేశించారు. పిటిషనర్లపై రౌడీషీట్లను తక్షణం మూసేయాలని ఈ ఏడాది జులై 15న తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. దానిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. సోమవారం నిర్ణయాన్ని వెల్లడించింది.

తీర్పులో ఏముందంటే

వ్యక్తుల హక్కులపై సహేతుకమైన షరతులు విధించడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కాదని హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారని ధర్మాసనం గుర్తుచేసింది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కని కేఎస్‌ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రౌడీషీట్లు తెరిచే వ్యవహారంతో ముడిపెట్టకూడదని వాదించారని వివరించింది. ఆధార్‌ కార్డుల జారీ సందర్భంగా వ్యక్తుల వివరాలు సేకరించడం గోప్యత హక్కుకు విఘాతం కలిగించడమేనని సుప్రీంకోర్టు చెప్పిందని జీపీ వాదించారని తెలిపింది. ఆ వాదనలను తోసిపుచ్చలేమంది. రౌడీషీట్‌ తెరవడం గోప్యత హక్కును హరించడమేనా అనే విషయాన్ని లోతుగా విచారించాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది.

పీఎస్‌వోలను అనుసరించి నేరాల నియంత్రణ కోసం 60 ఏళ్లుగా షీట్లు తెరుస్తున్నారని గుర్తుచేసింది. ‘సుంకర సత్యనారాయణ’ కేసులో పీఎస్‌వోలు కార్యనిర్వహణ ఉత్తర్వులు మాత్రమేనని ఏపీ హైకోర్టు గతంలో చెప్పిందని ధర్మాసనం పేర్కొంది. పీఎస్‌వో ఆధారంగా రౌడీషీట్లు తెరిచారు కాబట్టి వాటిని రద్దు చేస్తున్నట్లు గతంలో హైకోర్టు పేర్కొనలేదని వెల్లడించింది. అంతేకాక రౌడీషీట్లు తెరవడం, మూయడాన్ని క్రమబద్ధీకరించే విషయంలో ఆ తీర్పులో పలు ఆదేశాలిచ్చిందని గుర్తుచేసింది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.