ETV Bharat / city

MP Raghu rama: సమయం చూసి రాజీనామా చేస్తా.. మంచి మెజార్టీతో గెలుస్తా - ఎంపీ రఘురామ

author img

By

Published : Feb 11, 2022, 10:30 PM IST

mp raghu rama krishnam raju
mp raghu rama krishnam raju

తాను మాట్లాడితే తప్పు అంటున్న వైకాపా నేతలు.. వారు చేసేవి తప్పు అని మాత్రం చెప్పడం లేదన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు అడుగుతుంటే అరెస్టులు చేయటం సరికాదన్నారు. సమయం చూసుకొని రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించిన ఎంపీ.. తిరిగి మంచి మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

సమయం చూసుకొని రాజీనామా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కూకటివేళ్లతో పెకిలించేలా శంఖారావం పూరించనున్నట్లు వైకాపా నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజీనామా చేసి మంచి మెజారిటీతో గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు.

తమ పార్టీ నాయకులు తాను మాట్లాడడం తప్పు అంటున్నారు తప్ప.. వారు చేసేవి తప్పు అని చెప్పడం లేదన్నారు. ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచకపోయి ఉంటే.. యువతకు ఉద్యోగాలు వచ్చేవన్నారు. నోటిఫికేషన్లు విడుదల చేయమని అడుగుతున్న విద్యార్థులను అరెస్టు చేయడం తగదన్నారు.

తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు తండ్రి చనిపోతే ఆయనకు ఉద్యోగం ఇచ్చారని, ప్రభుత్వానికి తెలిసిన వారితో కేసు వేయించి అర్ధరాత్రి అరెస్టు చేయించారని ఎంపీ రఘరామ విమర్శించారు. అర్ధరాత్రి అరెస్టులు ఎందుకని ప్రశ్నించారు. ఆయన తప్పు చేస్తే సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలి తప్ప.. సీఐడీకి కేసు అప్పగించడమేమిటన్నారు.

జగనన్న సినీమాయ అందరికీ తెలుసన్న రఘురామ.. ఆయనే గొడవ పెట్టి ఆయనే పరిష్కరిస్తారని ఎద్దేవా చేశారు. హీరోలను జీరోలు చేశారని, చిరంజీవిని దీనంగా చూపడం సరికాదన్నారు. హీరోలంటే పవన్‌ కళ్యాణ్, బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లా ఉండాలన్నారు. ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ బోగస్‌ సంస్థ అని, అందులోని ఉద్యోగులు, వారి వేతనాలు వివరాలు కోరుతూ కోర్టులో కేసు వేస్తానని చెప్పారు.

ఇదీ చదవండి

CBN: ధైర్యం ఉంటే.. జగన్ ఆ పని చేయగలరా ?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.