ETV Bharat / city

రైతులపై తెదేపా నేతలది కపట ప్రేమ: మంత్రి శంకరనారాయణ

author img

By

Published : Oct 23, 2020, 8:30 PM IST

తెదేపా నేతలపై మంత్రి శంకరనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత పాలనలో కనీసం రైతులను పట్టించుకోలేదని... ఇవాళ రైతుల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. క్యాడర్​ను కాపాడుకునేందుకు లోకేశ్..జిల్లా పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

minister shankar narayana
minister shankar narayana

ముఖ్యమంత్రి జగన్​ను విమర్శించే స్థాయి నారా లోకేశ్​కు లేదని మంత్రి శంకరనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఉన్నారన్న విషయం కూడా తెలియని లోకేశ్‌.. ప్రభుత్వాన్ని విమర్శించటం సిగ్గుచేటని విమర్శించారు. తెదేపా పాలనలో కనీసం రైతులను పట్టించుకోలేదని.. ఇవాళ రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జిల్లాల్లోని పార్టీ క్యాడర్​ను కాపాడుకునేందుకు పర్యటనలు చేస్తున్నారు తప్ప..రైతులపై ప్రేమతో కాదన్నారు. కరోనా సమయంలోనూ పక్క రాష్ట్రానికి వెళ్లి దాక్కున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి

'భాజపా ఉచిత టీకా వాగ్దానం చట్టబద్ధమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.