ETV Bharat / city

vizag steel plant: కేంద్రాన్ని ఒక్క ప్రశ్నా అడగలేదేం..? పవన్​ కు మంత్రి సీదిరి కౌంటర్

author img

By

Published : Nov 1, 2021, 3:43 PM IST

Updated : Nov 1, 2021, 5:28 PM IST

స్టీల్ ప్లాంట్ అంశంలో జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలపై మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు(minister seediri appala raju slams pawan kalyan news). కేంద్రాన్ని ఒక్క ప్రశ్న అడగకుండా.. రాష్ట్రానిదే బాధ్యత అనటం ఏంటని ప్రశ్నించారు. తాజాగా ఆయన వ్యాఖ్యలు.. రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు.

minister seediri appala raju
minister seediri appala raju

మంత్రి సీదిరి అప్పలరాజు

కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తీసుకున్న నిర్ణయం.. పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? అని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు(minister seediri appala raju slams pawan kalyan news). శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన.. స్టీల్ ప్లాంట్‌పై వైకాపా ప్రభుత్వం చేస్తున్న కృషి పవన్​కు తెలియదా..? అని నిలదీశారు. స్క్రిఫ్టు రాసి ఇచ్చిన వారు.. పవన్ కు అసలు విషయం చెప్పకుండా పక్క దారి పట్టించారని ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని ఒక్క ప్రశ్న కూడా అడగకపోవటం.. ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమన్నారు.

'స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్రాన్ని ఒక్క మాట కూడా అడగలేదు. రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత ఎలా అవుతుంది..? పవన్ వ్యాఖ్యలు.. ఆయన తీసుకునే ప్యాకేజీలకు నిదర్శనం. పవన్ రాజకీయాలను చూసి ఏ ఒక్కరూ హర్షించరు. చంద్రబాబు నుంచి బయటపడితే పవన్​కు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. 9 నెలల పాటు వైకాపా పోరాడుతున్న విషయం పవన్​కు మాత్రమే తెలియదు. పార్లమెంట్ సాక్షిగా వైకాపా ఎంపీలు గళమెత్తారు' - సీదిరి అప్పలరాజు, రాష్ట్ర మంత్రి

ఇదీ చదవండి

YSR Lifetime Achievement Awards : కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోనూ పురస్కారాలు: జగన్‌

Last Updated : Nov 1, 2021, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.