ETV Bharat / city

పవన్ రాష్ట్రానికి అద్దె మైకులా తయారయ్యారు: పేర్ని నాని

author img

By

Published : Apr 4, 2021, 3:53 PM IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై మంత్రి పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అద్దె మైకులా తయారయ్యారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి కూడా అని ఎద్దేవా చేశారు. తిరుపతి ప్రజలు వైకాపాను కాదు... పవన్​నే నిలదియాలని పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై పవన్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరని నిలదీశారు.

పేర్ని నాని
పేర్ని నాని

పేర్ని నాని

పవన్ కల్యాణ్‌ రాష్ట్రానికి అద్దె మైకులా తయారయ్యారని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఉత్తరాది భాజపా దక్షిణాదికి అన్యాయం చేస్తోందని పవన్ అన్నారని... ఇప్పుడేమో భాజపాకు మద్దతివ్వాలని అంటున్నారని ధ్వజమెత్తారు. విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం కేసుల్లో భాజపా ప్రమేయం ఉందని పేర్ని నాని ఆరోపించారు. అందుకే సీబీఐ విచారణ కోరినా పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్‌ అజ్ఞాతవాసే కాదు.. అజ్ఞానవాసి కూడా. వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుంటే పవన్ మాత్రం జగన్‌ను తిడుతున్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ చదువుతున్నారు. సునీల్ దేవధర్‌.. పంచాయతీ సర్పంచిగా కూడా గెలవరు. ప్రత్యేక హోదాపై పవన్ ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు? విశాఖ ఉక్కును అమ్మేస్తామంటున్నా భాజపాను ఎందుకు నిలదీయరు?- పేర్ని నాని, మంత్రి

ఇదీ చదవండి:

పరిషత్ ఎన్నికలపై విచారణ.. వాదనలు వినిపిస్తున్న ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.