ETV Bharat / city

TS MINISTER MALLAREDDY: 'ఆ కామాంధున్ని విడిచిపెట్టేది లేదు.. ఎన్​కౌంటర్ చేయాలి..​ చేస్తం'

author img

By

Published : Sep 14, 2021, 7:47 PM IST

తెలంగాణ రాష్ట్రం సైదాబాద్​లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘటనపై మంత్రి మల్లారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగుడిని ఎన్​కౌంటర్​ చేయాల్సిందేనని ఉద్ఘాటించారు. కచ్చితంగా ఆ నిందితున్ని పట్టుకుని ఎన్​కౌంటర్​ చేస్తామని ప్రకటించారు.

Mallareddy
Mallareddy

తెలంగాణ రాష్ట్రం సైదాబాద్​లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘటనపై మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగుడిని ఎన్​కౌంటర్​ చేయాల్సిందేనని ఉద్ఘాటించారు. కచ్చితంగా ఆ నిందితున్ని పట్టుకుని ఎన్​కౌంటర్​ చేస్తామని ప్రకటించారు. మేడ్చల్ పట్టణంలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి... సమావేశం ముగించుకుని వెళ్లేటప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు గానూ ఈ విధంగా స్పందించారు. ప్రశ్న వినగానే కోపంతో ఊగిపోయిన మంత్రి.. నిందితున్ని ఎన్​కౌంటర్​ చేసి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తామని తెలిపారు.

ఆ కామాంధున్ని విడిచిపెట్టేది లేదు.. ఎన్​కౌంటర్ చేయాలి..​ చేస్తం

ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం..

"సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఘటన మాత్రం చాలా ఘోరం. వాన్ని తప్పకుండా ఎన్​కౌంటర్​ చేయ్యాలె. తప్పకుండా మేం వాన్ని పట్టుకుంటాం. ఎన్​కౌంటర్​ చేస్తం. త్వరలోనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తం. మా మనసులో చాలా బాధ ఉన్నది. అన్ని అనుకోంగనే కావు. తప్పకుండా వాళ్లను కలుసుకుని మా ఓదార్పునిస్తం. పరిహారం అందజేస్తం. అన్ని విధాలా ఆదుకుంటాం. వాన్ని ఎన్​కౌంటర్​ చేస్తం."- మల్లారెడ్డి, మంత్రి

ఇవీ చూడండి:

FAKE CHALLANS: నకిలీ చలాన్ల బాధ్యులపై కఠిన చర్యలు: మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.