ETV Bharat / city

అమానవీయం: రాత్రంతా వర్షంలోనే కరోనా రోగి మృతదేహం

author img

By

Published : Aug 13, 2020, 5:43 PM IST

కొవిడ్​తో మరణిస్తే సొంత మనుషులే పరాయి వాళ్లలా చూస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధి సోకే అవకాశం తక్కువేనని నిపుణులు ఎంత చెప్పినా ప్రజల్లో అవగాహన రావడం లేదు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో కరోనా మృతుడిని బయట పడేసి వర్షంలో తడుస్తున్నా ఎవరూ కన్నెత్తి చూడటం లేదంటే... ఏ పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు.

man died with covid
అమానవీయం: రాత్రంతా వర్షంలోనే కరోనా రోగి మృతదేహం

మనం పోరాడాల్సింది కొవిడ్​ వ్యాధితో గాని... రోగితో కాదని వైరస్​ గురించి ఎంతలా అవగాహన కల్పిస్తున్నా.. ప్రాణ భయంతోనో... అవగాహన లోపంతోనే కరోనా రోగులకు అవమాన ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. బతికుండగానే మనుషుల్లా చూడడం లేదు.. చివరకు చనిపోయినా కనికరం కానరావడం లేదు.

మనుషుల ప్రవర్తన, మానవత్వం అంటే ఏంటో... కరోనా బట్టబయలు చేస్తోంది. బంధువులు, స్నేహితులే కాదు... కుటుంబసభ్యులు కూడా అతీతులేం కాదని నిరూపిస్తోంది. అలాంటి అమానవీయ ఘటన...తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో వెలుగుచూసింది. కొవిడ్​తో మృతి చెందిన తల్లి(65), కుమారుడు(35) అంత్యక్రియలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు.

వైరస్​తో బాధ పడుతున్న అతడు... నిన్న అర్ధరాత్రి సమయంలో సోఫాలో కూర్చొని అక్కడే ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని కుటుంబసభ్యులు బయట పడేశారు. రాత్రి నుంచి వర్షంలో తడుస్తూనే ఉంది. ఈ రోజు ఉదయం తల్లి చనిపోయింది. అదే కుటుంబంలో మరి కొందరు వైరస్​ సోకి చికిత్స పొందుతున్నారు. కాలనీవాసులు తలుపులు వేసుకొని బయటకు కూడా రావడం లేదు. అధికారులు అటువైపే చూడటం లేదు.

ఇదీ చదవండి:

ప్రతి పరిశ్రమకు ఆధార్ తరహాలో ప్రత్యేక సంఖ్య..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.