ETV Bharat / city

'తెలంగాణ విద్యార్థులను భారత్‌కు రప్పించండి.. ఖర్చులు మేమే భరిస్తాం'

author img

By

Published : Feb 25, 2022, 4:50 PM IST

KTR Tweet To Union Minister JaiShankar
కేంద్ర మంత్రికి కేటీఆర్​ ట్విట్​

KTR Tweet To Union Minister JaiShankar : ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల గోడును విదేశాంగ మంత్రి జైశంకర్‌ దృష్టికి తీసుకువెళ్లారు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. వారిని స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని.. దానికయ్యే ఖర్చంతా రాష్ట్ర సర్కారే భరిస్తుందని హామీ ఇచ్చారు.

KTR Tweet To External Affairs Minister : ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యార్థులను క్షేమంగా తీసుకొచ్చేందుకు మాత్రం త్వరగా కేంద్రం చర్యలు తీసుకోవాలని ట్విటర్ ద్వారా రిక్వెస్ట్ చేశారు.

  • Humble appeal to Sri @DrSJaishankar Ji on the plight of students from Telangana stranded in Ukraine🙏

    We appeal to Govt of India to arrange for special aircrafts & Telangana Govt is ready to bear the full travel expenses for these students so we can bring them home safe &soonest

    — KTR (@KTRTRS) February 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణ సర్కార్ చర్యలు..
మరోవైపు.. ఉక్రెయిన్‌లోని తెలుగువారిని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్​లో చిక్కుకున్న తెలంగాణవాసుల క్షేమం కోసం అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దిల్లీలోని తెలంగాణభవన్‌, రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హెల్ప్‌లైన్ సెంటర్లకు రాత్రి నుంచి 75 ఫోన్‌ కాల్స్ వచ్చినట్లు సీఎస్‌ వెల్లడించారు.

దిల్లీలోని తెలంగాణ భవన్​ రెసిడెంట్​ కమిషనర్​.. విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారని సీఎస్​ చెప్పారు. ఉక్రెయిన్​లో మొత్తం ఎంతమంది ఉన్నారన్న సమాచారం ఇప్పటి వరకు లేదన్నారు. కన్సల్టెన్సీల ద్వారా వివరాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్​లో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడుతున్నామని.. కౌన్సిలింగ్ ఇస్తున్నామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

తెలంగాణ సచివాలయంలో సంప్రదించాల్సి నెంబర్లు..

ఈ.చిట్టిబాబు ఏఎస్​ఓ : 040-23220603

ఫోన్ నంబర్ : +91 9440854433

ఈ -మెయిల్ ఐడీ : so_nri@telanagan.gov.in

దిల్లీ తెలంగాణ భవన్​లో సంప్రదించాల్సిన నెంబర్లు..

విక్రమ్​సింగ్​మాన్ : +91 7042566955

చక్రవర్తి పీఆర్​ఓ : +91 9949351270

నితిన్ ఓఎస్డీ : +91 9654663661

ఈమెయిల్ ఐడీ : rctelangana@gmail.com

సంబంధిత కథనాలు :

Helpline Nos. for AP Students: ఉక్రెయిన్​లోని విద్యార్థుల తరలింపుపై సీఎం సమీక్ష..హెల్ప్​లైన్ నంబర్లు ఏర్పాటు

Telugu students on Ukraine crisis : ఉక్రెయిన్‌లో యుద్ధం.. స్వస్థలాలకు రావడానికి తెలుగు విద్యార్థుల బెంబేలు

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మైలవరం విద్యార్థి.. ఆందోళనలో తల్లిదండ్రులు

Telugu Students @ Ukraine: 'ఉక్రెయిన్​లో ఉన్న మా పిల్లలను స్వదేశానికి రప్పించాలి'

'మా పిల్లలకు తిండి లేదు... స్వదేశానికి తీసుకురండి'

Ukraine Crisis: 'సైరన్‌ మోగితే బంకర్లలోకి వెళ్లమన్నారు'.. ఉక్రెయిన్​లో తెలుగు విద్యార్థి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.