KA Paul: "దేశంలో ప్రతిపక్ష స్థానాన్ని... మేమే భర్తీ చేస్తాం"

author img

By

Published : May 13, 2022, 5:46 PM IST

Updated : May 13, 2022, 8:05 PM IST

KA Paul

KA Paul: వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణల్లోని 41 సీట్లు గెలుస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందన్న పాల్... ప్రతిపక్ష స్థానాన్ని తామే భర్తీ చేస్తామన్నారు.

KA Paul: వచ్చే ఎన్నికల్లో ఒక్క హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం తప్ప... ఆంధ్ర, తెలంగాణల్లోని 41 సీట్లు గెలుస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అలాగే దక్షిణభారత రాష్టాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పనైపోయిందన్న పాల్... ప్రతిపక్ష స్థానాన్ని తామే భర్తీ చేస్తామన్నారు. ఆంధ్ర, తెలంగాణతోపాటు దేశ అప్పులపై... కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించానన్నారు.

"ఏపీ అప్పులు రూ.8 లక్షల కోట్లు.. తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.4.50 లక్షల కోట్లుగా ఉంది. భారత్‌ అప్పులు చూస్తే రూ.కోటి లక్షలకు చేరింది. కేవలం రూ.3.50 లక్షల కోట్లు అప్పు చేసిన శ్రీలంక ఇవాళ దివాళా తీసింది. ఇందుకు కుటుంబ పాలన కూడా ఒక కారణం. కేసీఆర్‌ కుటుంబం 8 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తోంది. రూ.7లక్షల కోట్లు ఏమయ్యాయో కేసీఆర్‌, కేటీఆర్ చెప్పరు. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, ఆంధ్రా, తెలంగాణ అప్పులపై అమిత్‌ షాతో చర్చించాను. నాపై జరిగిన దాడిని అమిత్‌ షా తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు లేవు.. ఇవ్వండని అమిత్‌ షాను కోరాను. ఆంధ్రప్రదేశ్‌లో భాజపా, జనసేనకు ఎలాంటి ఓటు బ్యాంక్ లేదు. ఓటు బ్యాంక్‌ లేని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెంట ఎందుకు పడుతున్నారని కేంద్ర మంత్రిని అడిగాను. మేం ఆయన వెంట పడటమేంటి.. ఆయనే మా వెంట పడుతున్నారని అమిత్‌ షా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ మినహా అన్ని ఎంపీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లాను. ఇక ప్రజలే నిర్ణయిస్తారు" అని కేఏ పాల్‌

ఇవీ చదవండి:

Last Updated :May 13, 2022, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.