ETV Bharat / city

'కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఏపీ కృషి చేస్తుంది'

author img

By

Published : Nov 11, 2019, 5:15 PM IST

ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఏపీ.. తన వంతు కృషి చేస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా-గోదావరిలో బేసిన్​లో అపారమైన చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని వెల్లడించారు.

'కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఏపీ కృషి చేస్తుంది'

'కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఏపీ కృషి చేస్తుంది'

కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కృషి చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి గౌతమ్​రెడ్డి స్పష్టం చేశారు. చమురు ఆధారిత పెట్రో కెమికల్ పరిశ్రమలకు ఏపీ అనుకూలమైన ప్రదేశమని పేర్కొన్నారు. ముంబయిలో జరుగుతున్న గ్లోబల్ కెమికల్స్, పెట్రో కెమికల్స్ సదస్సుకు హాజరైన మంత్రి.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై పారిశ్రామిక వేత్తలు, పెట్రో కెమికల్ పరిశ్రమల ప్రతినిధులకు వివరించారు. సహజ నిక్షేపాలున్న ఏపీలో పెట్టుబడులు, వృద్ధికి అన్ని రాష్ట్రాలకూ ఆహ్వానం పలుకుతున్నామని గౌతమ్​రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్​ అంతా పెట్రో కెమికల్ కారిడార్లదేనని.. కేంద్ర ఆర్థిక లక్ష్యంలో ఏపీ వాటా పెంచాలన్నదే తమ అభిప్రాయమని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి:అంతర్జాతీయ ప్రతికూలతలతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు

sample description

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.