ETV Bharat / city

హిమాచల్​ గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

author img

By

Published : Dec 14, 2020, 12:43 PM IST

Updated : Dec 14, 2020, 1:32 PM IST

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద అదుపుతప్పి వాహనం పక్కకు దూసుకెళ్లింది.

himachal-pradesh
himachal-pradesh

హిమాచల్​ గవర్నర్ దత్తాత్రేయకు తప్పిన ప్రమాదం

హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు పెను ప్రమాదం తప్పింది. తెలంగాణ చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద దత్తాత్రేయ వాహనానికి ప్రమాదం జరిగింది. అదుపుతప్పి రహదారి పక్కకు ఆయన ప్రయాణిస్తున్న వాహనం దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయ, డ్రైవర్, వ్యక్తిగత సహాయకుడు ఉన్నారు. ఈ ఘటన నుంచి ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్​ నుంచి సూర్యాపేటకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మరో వాహనంలో దత్తాత్రేయ సూర్యాపేటకు బయలుదేరారు.

Last Updated : Dec 14, 2020, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.