ETV Bharat / city

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో... హైకోర్టుకు సీబీఐ మధ్యంతర నివేదిక

author img

By

Published : Mar 31, 2021, 5:37 PM IST

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టుకు సీబీఐ మధ్యంతర నివేదిక ఇచ్చింది. పూర్తి నివేదిక ఇచ్చేందుకు సీబీఐ న్యాయవాది 3 నెలల సమయం కోరారు. తదుపరి విచారణ జూన్‌ 28కి వాయిదా వేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది.

High court
హైకోర్టులో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు విచారణ

న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐ మధ్యంతర నివేదికను సీల్డ్ కవర్​లో ధర్మాసనానికి సమర్పించింది. పూర్తి స్థాయి విచారణ చేసేందుకు 3 నెలల సమయం పడుతుందని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 28కి వాయిదా వేసింది.

న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచితంగా వ్యాఖ్యలు చేసిన కేసు దర్యాప్తును గతంలో ధర్మాసనం సీబీఐకి అప్పగించింది. హైకోర్టు ఆదేశానుసారం పలువురిని విచారించిన సీబీఐ అధికారులు మధ్యంతర నివేదికను సీల్డ్ కవర్​లో సమర్పించారు.

ఇదీ చదవండి:

'జగన్ సేవకులకు కాదు... జన సేవకులకు ఓటేయండి'

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.