ETV Bharat / city

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు : వాతావరణ శాఖ

author img

By

Published : May 29, 2021, 3:43 PM IST

Updated : May 29, 2021, 5:36 PM IST

మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు రాకకు అనుకూల వాతావరణం ఏర్పడినట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

heavy rains dropping upcoming three days in andhrapradhesh
వచ్చే మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు

మే 31 నాటికి కేరళలో నైరుతి రుతుపవనాలు ఆగమనానికి అంతా అనుకూలంగా ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి కొనసాగుతూనే ఉందని విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

ఈ ప్రభావంతో వచ్చే మూడు రోజుల వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు, ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.

ఇదీ చదవండి:

Hanuman birth place: 'కిష్కింధలోనే ఆంజనేయుడు పుట్టాడు'.. 'కాదు..తిరుగిరుల్లోని అంజనాద్రిలోనే'

Last Updated : May 29, 2021, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.