ETV Bharat / city

Insects in Basara IIIT mess: బాసర ట్రిపుల్ ఐటీ లో దారుణం ..కూరలో నిన్న కప్ప, నేడు తోకపురుగు

author img

By

Published : Mar 6, 2022, 6:04 PM IST

Basara IIIT
Basara IIIT

Insects in Basara IIIT mess: తెలంగాణ రాష్ట్రం బాసర త్రిపుల్ ఐటీలో వంటకాల్లో కీటకాలు కలకలం సృష్టిస్తోంది. శనివారం కూరలో కప్ప వచ్చిందని ఆరోపించిన విద్యార్థులు.. ఈ రోజు వండిన కూరలో తోక పురుగు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. నిజానిజాలను తెలుసుకునేందుకు వెళ్లిన మీడియాను సెక్యూరిటీ సిబ్బంది అనుమతించడం లేదు.

Insects in Basara IIIT mess: ప్రాథమిక అవసరాల్లో ఒకటైన ఆహారం.. నాణ్యతగా ఉన్నప్పుడే విద్యార్థులు చదివేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఆ ఆహారమే సరిగా లేకపోతే.. అది వారి ఆరోగ్యానికే ప్రమాదకరం. తెలంగాణలోని బాసర త్రిపుల్​ఐటీ మెస్​లో వరుసగా రెండు రోజులపాటు చోటుచేసుకున్న సంఘటనలు ఆందోళనకు దారితీస్తున్నాయి. నాణ్యమైన, ఉన్నత విద్యకు కేరాఫ్​గా నిలిచే విశ్వవిద్యాలయంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఆరోగ్యంపై ఆందోళన

నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విశ్వ విద్యాలయంలో.. శనివారం ఉదయం టిఫిన్ చేస్తుండగా కూరలో కప్ప వచ్చిందనే వార్త.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అది మరువకముందే ఇవాళ మధ్యాహ్న భోజన సమయంలో కూరలో తోకపురుగు వచ్చిందనే వార్త కలవరపెడుతోంది. కాగా అప్పటికే భోజనం చేసిన విద్యార్థులు.. తమ ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. భోజనం చేయని విద్యార్థులు.. అలాగే పస్తులుండిపోయారు. ఆ ఫొటోలను విద్యార్థులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్​గా మారాయి.

మీడియాకు నో పర్మిషన్​

కాగా ఈ విషయంపై ఆరా తీసేందుకు యూనివర్సిటీ వద్దకు వెళ్లిన మీడియాను సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. దీంతో పలు అనుమానాలకు బలం చేకూర్చినట్లుగా ఉంది. పై అధికారులు మీడియాను అనుమతించవద్దని చెప్పారని సిబ్బంది బదులిచ్చారు.

ఇదీ చదవండి: Brijesh Kumar Tribunal: 'ఆ 150 టీఎంసీల నీటిలో 125 మాకే ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.