ETV Bharat / city

ఆ ఉద్యోగులకు ఉచిత వసతి సౌకర్యం మరోసారి పొడిగింపు

author img

By

Published : Sep 14, 2022, 5:57 PM IST

Free Accommodation Extended : రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి వచ్చి అమరావతిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి సదుపాయాన్ని మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023 జూన్​ 26 వరకూ పొడిగిస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

Free Accommodation Extended
Free Accommodation Extended

Free Accommodation : హైదరాబాద్‌ నుంచి అమరావతి ప్రాంతానికి వచ్చి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని మరోమారు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని 2023 జూన్‌ 26 వరకు పొడిగిస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్‌ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, గుంటూరు.. విజయవాడ నగరాల్లో బస చేస్తున్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని 2024 వరకు పొడిగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.


ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.