Free Accommodation : హైదరాబాద్ నుంచి అమరావతి ప్రాంతానికి వచ్చి విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని మరోమారు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని 2023 జూన్ 26 వరకు పొడిగిస్తున్నట్టు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ సచివాలయం, శాసనసభ, హెచ్ఓడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్భవన్ ఉద్యోగులకు మాత్రమే ఈ పొడిగింపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే, గుంటూరు.. విజయవాడ నగరాల్లో బస చేస్తున్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని 2024 వరకు పొడిగించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
ఇవీ చదవండి: