Cinema Tickets: సినిమా టికెట్ ధరలపై కమిటీ సమావేశం

author img

By

Published : Jan 11, 2022, 1:30 PM IST

Updated : Jan 11, 2022, 7:47 PM IST

film tickets

Meeting on Cinema Ticket Rates: సినిమా టికెట్ ధరలపై ఈరోజు కమిటీ సమావేశం జరిగింది. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలోని 13 మంది సభ్యుల కమిటీ భేటీ అయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ ధరలు పెంచాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు కమిటీ సభ్యురాలు లక్ష్మి తెలిపారు.

సినిమా టికెట్ ధరలపై కమిటీ సమావేశం

సినిమా టికెట్ ధరల అంశంపై అమరావతి సచివాలయంలో.. కమిటీ సమావేశం నిర్వహించింది. జీవో నెంబర్ 35 ప్రకారమే ధరలు ఉండాలని కమిటీకి సూచించినట్లు.. కమిటీ సభ్యురాలు లక్ష్మి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ ధరలు పెంచాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు వెల్లడించారు. టికెట్ ధరలపై విస్తృతంగా చర్చించిన కమిటీ సభ్యులు వివిధ అంశాలను ప్రస్తావించారు.

ఈ వ్యవహారంపై.. విస్తృతంగా చర్చించిన అనంతరం తదుపరి సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. థియేటర్లలోని వసతులు, అగ్నిమాపక శాఖ విధించే నిబంధనల అమలుపై కూడా చర్చించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లలో స్వల్పంగా ధరలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.

'టికెట్ ధరల నిర్ధారణపై చర్చించాం. బీ, సీ సెంటర్లలో ధరలు మార్పు చేయాల్సి ఉంది. థియేటర్లలో వసతులు, అగ్నిమాపక నిబంధనలపై చర్చించాం. వచ్చే సమావేశంలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది' -ముత్యాల రాందాస్‌, కమిటీ సభ్యుడు

'సినిమా టికెట్ ధరలు పెంచాలని కమిటీకి సూచించా. ధరల తగ్గింపుతో థియేటర్లకు ఇబ్బంది కలుగుతుంది. 200కు పైగా థియేటర్లు మూతపడ్డాయి. నిబంధనల విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరాం' -బాలరత్నం, ఎగ్జిబిటర్‌, కమిటీ సభ్యుడు

ఇదీ చదవండి:

RGV TWEET: సినిమా టికెట్‌ ధరలపై మరోసారి ట్విటర్‌లో స్పందించిన ఆర్జీవీ

Last Updated :Jan 11, 2022, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.